కరోనా మృదంగం: యూఎస్లో దాటిన 90 లక్షలు, భారత్లో చేరువగా 80 లక్షల కేసులు..
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మృదంగం కంటిన్యూ అవుతోంది. గత 24 గంటల్లో 75 వేల 72 కేసులు అమెరికాలో వచ్చాయి. దీంతో పాజిటివ్ కేసులు 90 లక్షల 38 వేల 30గా ఉన్నాయి. అయితే రికవరీ రేటు కూడా బాగానే ఉంది. 58 లక్షల 77 వేల 964 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో అమెరికాలో 1039 మంది చనిపోయారు.
Recommended Video
ఇటు దేశంలోనూ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 43 వేల 893 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80 లక్షల సమీపంలోకి వచ్చింది. దేశంలో ప్రస్తుతం 79 లక్షల 90 వేల 322 మందికి వైరస్ సోకింది. అయితే 61 లక్షల 803 మందికి మాత్రం వైరస్ తగ్గింది. గత 24 గంటల్లో 58 వేల 439 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య కూడా బాగుంది. 72 లక్షల 59 వేల 509 మంది వైరస్ నుంచి క్యూర్ అయ్యారు.
గత 24 గంటల్లో 500 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య లక్ష 20 వేల 10కి చేరింది. గత 24 గంటల్లో 10 లక్షల 66 వేల 786 శాంపిల్స్ సేకరించామని ఐసీఎంఆర్ తెలిపింది. ఈ నెల 27వ తేదీ వరకు 10 కోట్ల 54 లక్షల 87 వేల 680 మందికి పరీక్షలు చేశామని వెల్లడించింది.