2015 అత్యంత చెత్త సెల్ఫీ ఇదే: షాక్ ఇచ్చారు
దుబాయ్: నూతన సంవత్సర వేడుకలు జరిగే సమయంలో ఓ హోటల్ మంటల్లో కాలిపోతుంటే దంపతులు సమీపంలో నిలబడి సెల్ఫీ తీసుకున్నారు. 2015లో అత్యంత చెత్త సెల్ఫీ ఇదే అంటూ ఆ దంపతులు విమర్శల పాలైనారు.
ప్రపంచంలోనే అత్యంత ఎతైన బుర్జ్ ఖలీఫా ఆకాశ హర్మ్యం సమీపంలో 63 అంతస్తుల్లో నిర్మించిన అడ్రస్ డౌన్ టౌన్ హోటల్ లో డిసెంబర్ 31వ తేది రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి తలెత్తిందని యూఏఈ వాసులు ఆందోళన చెందారు.
అయితే అదే సమయంలో హోటల్ సమీపంలో దంపతులు మంటల్లో కాలిపోతున్న హోటల్ కు ఎదురుగా నిలబడి సెల్ఫీ తీసుకున్నారు. తాము పెద్ద ఘనకార్యం చేస్తున్నామని చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చి సెల్ఫీలు తీసుకుని ఏఆర్ అలాటీఖీ అనే ట్విట్టర్ లో ఫోటోలు షేర్ చేశారు.
అయితే సోషల్ మీడియాలో దంపతుల మీద మండిపడుతున్నారు. వెనుక హోటల్ లో అమాయకులు మంటల్లో చిక్కుకుని ఉంటే మీకు సెల్ఫీలు కావాల్సి వచ్చిందా మూర్ఖులారా అని సిహామ్ ఏఆర్ అనే మహిళ ట్వీట్ చేశారు.
ఇలాంటి సెల్ఫీలు తీసుకోవడం నిజంగా సిగ్గుచేటు అని ఆమె మండిపడ్డారు. సెల్ఫీలు తీసుకోవడం మంచిదే, అయితే ఎలాంటి సందర్బాల్లో తీసుకోవాలి అని ఆలోచించాలని పలువురు సూచించారు. మొత్తం మీద దంపతులు చేసిన పనికి సోషల్ మీడియాలో వారికి చివాట్లు పెడుతున్నారు.