దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ దానిష్ సిద్దిఖీ అఫ్గానిస్తాన్లో ఆ దేశ బలగాలు, తాలిబన్ల మధ్య సాగుతున్న యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు.
2010 నుంచి రాయిటర్స్ వార్తా ఏజెన్సీకి పనిచేస్తున్న సిద్దిఖీ అఫ్గానిస్తాన్, ఇరాక్ యుద్ధాలు.. రోహింజ్యా సంక్షోభం, హాంకాంగ్ నిరసనలు, నేపాల్ భూకంపం వంటివి కవర్ చేశారు.
రోహింజ్యా సంక్షోభం రాయిటర్స్ సంస్థ రూపొందించిన డాక్యుమెంటరీకి 2018లో పులిట్జర్ ప్రైజ్ దక్కింది. ఆ డాక్యుమెంటరీ బృందంలో సిద్దిఖీ కూడా ఒకరు.
దానిష్ సిద్దిఖీ తీసిన ఫోటోలలో కొన్ని మీకోసం..
సిద్దిఖీ తీసిన చివరి చిత్రాలలో ఒకదాంట్లో.. కాందహార్ ప్రావిన్స్లోని చెక్పోస్ట్ వద్ద తాలిబన్లపై కాల్పులు జరుపుతున్న అఫ్గాన్ స్పెషల్ ఫోర్సెస్ సభ్యుడిని ఫొటో తీశారు.
కాందహార్లో అఫ్గాన్ స్పెషల్ ఫోర్సెస్తో కలిసి ఆయన ఈ వారం ప్రారంభం నుంచి తన జర్నలిస్ట్ వృత్తిరీత్యా వెళ్తున్నారు.
భారత్ నగరాలు, పల్లెలను కమ్మేసిన కరోనా సెకండ్ వేవ్లో ఆయన ఎన్నో ఫొటోలు తీశారు.
దిల్లీలోని అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రిలో ఒకే బెడ్పై చికిత్స పొందుతున్న ఇద్దరు కరోనా రోగుల ఫొటో ఆయన తీయగా ఏప్రిల్ 15న ప్రచురితమైంది.
దిల్లీలోని నివాస ప్రాంతాల పక్కనే ఉన్న ఒక దహన వాటికలో కోవిడ్ మృతుల సామూహిక అంత్యక్రియల చిత్రాన్ని ఆయన తీశారు. కోవిడ్ తీవ్రత, పెద్ద సంఖ్యలో మరణాలకు అద్దం పట్టే ఈ చిత్రం వైరల్గా మారింది.
కోవిడ్తో తండ్రి మరణించడంతో తల్లిని ఓదార్చుతున్న పిల్లల ఫొటో ఇది. ఇది సిద్దిఖీ కెమేరా పట్టుకున్న భావోద్వేగం.
సెకండ్ వేవ్ సమయంలో సిద్దిఖీ దిల్లీ వంటి నగరాలకే కాదు పల్లె ప్రాంతాలు, కొండ ప్రాంతాలకూ వెళ్లారు. కోవిడ్ బారిన పడిన మహిళను ఆమె మేనల్లుడు చేతుల్లో మోసుకుంటూ స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్తున్న ఈ చిత్రాన్ని సిద్దిఖీ ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాలలో తీశారు.
2020 ఏప్రిల్లో భారత్లో లాక్డౌన్ విధించిన సమయంలో నగరాల నుంచి లక్షలాది మంది సొంతూళ్లకు నడుచుకుంటూ సాగిపోయారు. ఉన్న కొద్దిపాటి వస్తువులు, పిల్లలను మోసుకుంటూ రోజంతా నడుస్తూ వెళ్తున్న అలాంటి కుటుంబం ఫొటో ఇది.
2017 ఆగస్ట్లో మియన్మార్ ఆర్మీ విరుచుకుపడడంతో రోహింజ్యాలు బంగ్లాదేశ్కు శరణార్థులుగా వచ్చారు. ఒక చిన్న బోటులో సముద్రం మీదుగా బంగ్లాదేశ్ చేరుకున్న తరువాత తీరాన్ని తాకుతున్న మహిళ చిత్రాన్ని సిద్దిఖీ 2017 సెప్టెంబరులో తీశారు.
ఇవి కూడా చదవండి:
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- కోవిడ్–19 రోగులకు ప్లాస్మా దానం చేసిన తబ్లిగీలు
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- యోగి 'ఎన్కౌంటర్’ విధానాలతో న్యాయం జరుగుతుందా.. నేరాలు పెరుగుతున్నాయా?
- 'శ్రీరాముడు నేపాల్లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. 'అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)