వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో డేంజరస్ బ్యాక్టీరియా లీక్... పురుషులపై తీవ్ర ప్రభావం..ఇతర దేశాలకు వ్యాపిస్తుందా..?

|
Google Oneindia TeluguNews

చైనా: కరోనా బ్యాక్టీరియా‌కు కేరాఫ్‌గా నిలిచింది చైనా. చైనాలోనే తొలి కరోనాబ్యాక్టీరియా బయటపడి ఆ తర్వాత ప్రపంచ దేశాలకు పాకింది. ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. తాజాగా చైనాను మరో బ్యాక్టీరియా పట్టి పీడిస్తోంది. ఇది ఏకంగా మగవారి పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంతకీ ఆ బ్యాక్టీరియా ఏంటి..?

Recommended Video

COVID-19 : China లో బయటపడ్డ ప్రమాదకర బ్యాక్టీరియా.. ఇతర దేశాలకు వ్యాపిస్తుందా..? || Oneindia Telugu

తెలంగాణలో కరోనా: మళ్లీ రెండువేలకు పైగా: డిశ్చార్జీల్లో తగ్గుదల: కారణం? తెలంగాణలో కరోనా: మళ్లీ రెండువేలకు పైగా: డిశ్చార్జీల్లో తగ్గుదల: కారణం?

 కొత్త బ్యాక్టీరియా బ్రూసెల్లాసిస్

కొత్త బ్యాక్టీరియా బ్రూసెల్లాసిస్

వాయువ్య చైనాను కొత్త బ్యాక్టీరియా వణికిస్తోంది. ఈ బ్యాక్టీరియా పేరు బ్రూసెల్లాసిస్. ఇప్పటికే వెయ్యిమందికి పైగా ఈ బ్యాక్టీరియా బారిన పడి అల్లాడుతున్నారు. వీరందరికీ పాజిటివ్‌గా తేలింది. గతేడాది బయో ఫార్మాషూటికల్ కంపెనీ నుంచి లీక్ అయిన రసాయనాల వల్లే ఈ బ్యాక్టీరియా మనుషులకు హానీ చేకూరుస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు బ్రూసెల్లాసిస్ బ్యాక్టీరియా బారిన 3245 మంది పడ్డట్టు అధికారులు చెప్పారు. ఈ బ్యాక్టీరియా ముందుగా జంతువులకు సోకి ఆ తర్వాత మనుషులకు వ్యాపిస్తోందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ బ్యాక్టీరియా పురుషుల వృషణాలను దెబ్బతీసి వారి సంతాన ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొన్ని నివేదికల ప్రకారం తెలుస్తోంది.

 అమెరికా పరిశోధకులు ఏం చెబుతున్నారు..

అమెరికా పరిశోధకులు ఏం చెబుతున్నారు..

బ్రూసెల్లాసిస్ బ్యాక్టీరియాకు మాల్టా ఫీవర్ లేదా మెడిటెరేనియన్ ఫీవర్ అని కూడా పిలుస్తారని అమెరికాలోని సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ వెల్లడించింది. ఈ బ్యాక్టీరియా మనుషుల్లో విపరీతమైన తలనొప్పి, కండరాల నొప్పులు, జ్వరం, అలసటను తీసుకొస్తుందని అమెరికా సంస్థ పేర్కొంది.బ్రూసెల్లాసిస్ బ్యాక్టీరియా అంటుకుంటే క్రమంగా తగ్గిపోతుందని కొన్ని సార్లు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అంటే ఆర్థ్రిటిస్, వాపులు, కొన్ని శరీర అవయవాల్లో వాపులు కనిపిస్తాయని స్పష్టం చేశారు.

 ఓ ఫార్మా కంపెనీ నుంచి లీక్

ఓ ఫార్మా కంపెనీ నుంచి లీక్

ఇక ఒక మనిషి నుంచి మరో మనిషికి ఈ వ్యాధి సోకడం చాలా అరుదుగా జరుగుతుందని చెప్పిన వైద్యులు... ఎక్కువగా కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల, లేదా బ్యాక్టీరియాను పీల్చడం ద్వారా వ్యాధి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం వాయువ్య చైనాలో బ్యాక్టీరియాను పీల్చడం వల్లే వచ్చిందని వెల్లడించారు. గతేడాది జూలై -ఆగష్టు మధ్య జోంగ్మూ లాన్జౌ బయలాజికల్ ఫార్మాష్యూటికల్ ఫ్యాక్టరీ నుంచి బ్యాక్టీరియా లీక్ అయ్యిందని ప్రముఖ పత్రిక సీఎన్ఎన్ కథనాన్ని ప్రచురించింది. పశువుల కోసం బ్రూసెల్లా వ్యాక్సిన తయారు చేస్తున్న క్రమంలో కొన్ని ఎక్స్‌పైర్ అయిన డిస్‌ఇన్ఫెక్టెంట్లు, శానిటైజర్లను వినియోగించడం జరిగిందని కథనంలో పేర్కొంది. అయితే వ్యర్థ వాయువులను విడుదల చేసినప్పుడు కొంత బ్యాక్టీరియా ఇందులో కలవడం... దీన్ని అక్కడి ప్రజలు పీల్చడం వల్ల వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది.

 ఇప్పటి వరకు నమోదు కాని మరణాలు

ఇప్పటి వరకు నమోదు కాని మరణాలు

ముందుగా కొంతమంది మాత్రమే ఈ బ్యాక్టీరియా బారిన పడినట్లు సమాచారం. కానీ 21,000 మందికి పరీక్షలు నిర్వహించగా దీని బారిన పడిన వారి సంఖ్య అమాంతం పెరిగిపోయిందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు బ్రూసెల్లాసిస్ బారిన పడి మరణించిన వారు ఎవరూ లేరని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ బ్యాక్టీరియా బారిన పడిన వారి సంఖ్య అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. అంతేకాదు ఈ కొత్త వ్యాధి మళ్లీ ఎంతవరకు ప్రమాదకరంగా మారుతుందోనని వైద్యులు భయపడుతున్నారని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.

English summary
After Coronavirus a new bacteria by name Brucellosis has hit the people in North west China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X