వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: నలుగురు కూతుర్లను ఉరేసి చంపిన తండ్రి

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి తండ్రి తన నలుగురు కుమార్తెలను ఉరేసి హత్య చేశాడు. లాహోర్‌కు 215కిలో మీటర్లు దూరంలోని చక్ జుమ్రా పట్టణంలో చోటు చేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇర్షద్ అహ్మద్‌కి ఏడుగురు సంతానం. అతని భార్య ఇద్దరు పిల్లల్ని తమ బంధువుల పెళ్లికి తీసుకెళ్లగా.. మరో నలుగురు కుమార్తెలు ఇంట్లోనే ఉన్నారు. వారు నిద్రిస్తున్న సమయంలో ఇర్షద్ నలుగురినీ తీగతో ఉరేసి చంపాడు.

భార్య ఇంటి రాగానే మంచంపై పిల్లల మృతదేహాలు పడి ఉండటంతో సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి మానసిక స్థితి సరిగా లేక ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Depressed dad kills 4 daughters

బస్సులోయలో పడి 17 మంది మృతి

పెరూలోని అమెజాన్ ప్రాంతంలో బస్సు లోయలో పడి 17 మంది మరణించారు. ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి 150 మీటర్ల లొతున్న లోయలో పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 50 మంది ఉన్నారని సోమవారం హైవే పోలీసు అధికారులు తెలిపారు.

వీరిలో 17 మంది మరణించగా, 32 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రి తరలించారు. ప్రమాద బాధితులలో ఎక్కువగా సీజర్ వాల్లేజో పబ్లిక్ స్కూల్ కి చెందిన విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు స్కూల్ పరేడ్ లో పాల్గొని ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

English summary
A Pakistani man has murdered his four young daughters in the central province of Punjab, police said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X