ఈక్వడార్లో భారీ భూకంపం: రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదు
ఈక్వడార్లో భారీ భూకంపం సంభవించింది. పెరూతో సరిహద్దు చేసే ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. సరిహద్దుల్లో భూకంపం రావడంతో ఆ ప్రభావం రెండు దేశాలపై పడింది. ఈక్వడార్, పెరూ దేశాల్లో భూకంప ప్రభావం స్పష్టంగా కనిపించింది. అంతేకాదు ఈ భారీ భూకంపం దాటికి దక్షిణ అమెరికాలో కూడా కొన్ని చోట్ల ప్రభావం కనిపించినట్లు అమెరికా వాతావరణ శాఖ తెలిపింది.
భూకంపం రావడంతో అక్కడి ప్రజలు అలర్ట్ అయ్యారు. ఈక్వడార్లో భూకంపం వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే భూకంపం ధాటికి జరిగిన నష్టం పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ఓ వ్యక్తి నిద్రలో ఉండగా తను పడుకున్న మంచం కదులుతూ ఉండటం గమనించి లేచి చూసినట్లు చెప్పారు. అంతలోనే కిటికీ అద్దాల్లో చీలిక రావడం గమనించి బయటకు పరుగులు తీసినట్లు సోషల్ మీడియాలో తన అనుభవం గురించి చెప్పాడు. చాలాసేపు భూమి కంపించిందని ఆ సమయంలో భయంతో వణికిపోయినట్లు ఆ వ్యక్తి వివరించాడు.

భూకంపం స్థానిక కాలమాన ప్రకారం తెల్లవారుజామున ఉదయం 5 గంటల ప్రాంతంలో సంభవించిందని... భవంతి కదులుతున్నట్లు తమకు అనిపించి ఇంటిలోనుంచి బయటకు పరుగులు తీసినట్లు హోటల్ యజమాని ఒకరు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications