ఘోర రోడ్డు ప్రమాదం: చెట్టును ఢీకొన్న బస్సు, 43 మంది మృతి
హరారేలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 43 మంది అక్కడికి అక్కడే మృతి చెందారు. జాంబియా వెళ్తుండగా హురుగ్వేలోని న్యామకేత్ ప్రాంతంలో కింగ్ లయన్ బస్సు ప్రమాదానికి గురవడంతో ఈ విషాదం.
హరారే: హరారేలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 43 మంది అక్కడికి అక్కడే మృతి చెందారు. జాంబియా వెళ్తుండగా హురుగ్వేలోని న్యామకేత్ ప్రాంతంలో కింగ్ లయన్ బస్సు ప్రమాదానికి గురవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది.
మరో 24 మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు ఓ చెట్టును ఢీకొట్టిందని, దీంతో ప్రయాణీకులు మృతి చెందారని పోలీసు అధికారి చారిటీ చరంబ తెలిపారు.

ఆ సమయంలో బస్సు వేగంగా వెళ్తోందని, డ్రైవర్ బస్సును అదుపు చేయడంలో విఫలమయ్యాడని చెప్పారు. ఇటీవలే కొద్ది నెలల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది చనిపోయారని, మళ్లీ మరో సంఘటన విషాదకరమని ఆ అధికారి అన్నారు.












Click it and Unblock the Notifications