కరోనా వైరస్ : ఆధునిక ఇరాక్ ఆర్మిటెక్ట్ నిర్మాత కన్నుమూత..

ఆధునిక ఇరాక్‌ ఆర్కిటెక్ట్‌ నిర్మాత రిఫత్ చందిర్‌జీ(93) కరోనా వైరస్‌ సోకి శుక్రవారం బ్రిటన్‌లో కన్నుమూసినట్టు ఇరాక్‌ వర్గాలు వెల్లడించాయి. ఇరాక్‌లోని ప్రసిద్ద 'ఫ్రీడమ్ మోనమెంట్(స్వేచ్చ స్మారక చిహ్నం)'ను రిఫతే నిర్మించారు. బాగ్దాద్‌లోని ఈ స్మారక చిహ్నం ఇప్పుడు నిరసన కార్యక్రమాలకు కేరాఫ్‌గా మారిపోయింది.

రిఫత్ మృతిపై ఇరాక్ అధ్యక్షుడు బర్హమ్ సాలెహ్,కేర్‌టేకర్ ప్రీమియర్ అదెల్ అబ్దెల్ మహ్దీ విచారం వ్యక్తం చేశారు. రిఫత్ 20వ శతాబ్దపు ఇరాక్ దిగ్గజమని బాగ్దాద్ మోడర్న్ ఆర్కిటెక్ట్ స్కాలర్ పియేరీ అభిప్రాయపడ్డారు. రిఫత్ మరణంతో ఇరాక్‌తో పాటు ప్రపంచ ఆర్కిటెక్ట్ రంగం తన శ్వాసను కోల్పోయిందని సాహెల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Father Of Modern Iraqi Architecture Dies Of COVID-19

Recommended Video

    Telangana Lockdown Extension Till April 30th, Consequences

    కాగా,1926లో బాగ్దాద్‌లో జన్మించిన చందిర్‌జీ లండన్‌లో చదువుకుని 1950లో తిరిగి ఇరాక్‌కి వచ్చారు. 'అజ్ఞాత సైనికుడు' పేరుతో ఓ అందమైన భవనం,అలాగే బాగ్దాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలకు ఆయనే ఆర్కిటెక్ట్ చేశారు. కానీ ఇరాక్‌లో బాతిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన ఆర్కిటెక్ట్ చేసిన 'అజ్ఞాత సైనికుడు' భవనాన్ని కూల్చేసి.. ఆ స్థానంలో సద్దాం హుస్సేన్ విగ్రహాన్ని పెట్టారు. అంతేకాదు,చందిర్‌జీని 20 నెలల పాటు అబు ఘరీబ్ జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఓ కాన్ఫరెన్స్ హాలు నిర్మాణం కోసమని సద్దాం ఆయన్ను జైలు నుంచి విడుదల చేశాడు. ఈ అనుభవాలన్నింటినీ 'ది వాల్ బిట్వీన్ టూ డార్క్‌నెస్' పుస్తకంలో సద్దాం రాశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+