ఫర్టిలిటి సెంటర్ డాక్టర్ నిర్వాకం... తన వీర్యాన్నే పదకొండు మందికి పంపిణి....!
...వైద్యుడు దేవుడితో సమానం అని అంటారు..అలాంటీ వైద్యుడు ఎం చెప్పినా నమ్మే పరిస్థితి రోగులకు ఉంటుంది..అయితే ఇదే నమ్మకాన్ని కొంతమంది వైద్యులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్న సంఘటనలు కోకొల్లలు..ఇలా వైద్యుల నిర్లక్ష్యం, జిమ్మిక్కులపై అనే కథనాలు, సినిమాలు కూడ వచ్చిన పరిస్థితి చూశాము..కాని కెనాడలోని వైద్యుడు మాత్రం మానవత్వమే మంటగలిపేలా చేశాడు.. మానవ సంబంధాలకు విలువ లేకుండా చేశాడు.తల్లి దండ్రులకు తెలియకుండా తన వీర్యాన్ని దానం చేసి సంతోనోత్పత్తికి కారణమయ్యాడు.
సంతోత్పత్తి కేంద్రంలో అక్రమాలు...
లండన్లోని బెర్నార్డ్ నార్మన్ అనే వైద్యుడు సంతోనోత్పత్తి కేంద్రాన్ని గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాడు. అయితే పిల్లల కోసం తన వద్దకు వచ్చే వారి మానసిక ఆందోళనను అసరా చేసుకున్న వైద్యుడు ఘాతుకానికి పాల్పడ్డాడు.. పిల్లలు లేరని వచ్చిన మహిళలకు వాళ్లు కోరుకున్న వారు లేదా భర్తల వీర్యంతో సంతోత్పత్తిని కల్గించాల్సి ఉంటుంది..అయితే ఇందుకు విరుద్దంగా బెర్నార్డ్ వ్యవహరించారు...
ఒకరి వీర్యానికి బదులు ఇంకోకరి వీర్యం
ఒకరి వీర్యానికి బదులు ఇంకోకరి వీర్యంతో సంతోత్పత్తి కల్గే విధంగా చేశాడు.. కొన్ని సమయాల్లో తన వీర్యన్నే మహిళలకు ఎక్కించి సంతానాన్ని ప్రసాదించాడు... ఇలా వందల మందికి ఒకరి వీర్యం మరోకరికి ఇచ్చినట్టు విచారణలో తేలింది.. .. కాగా బెర్నాడ్ వీర్యంతోనే సుమారు 15 మంది వరకు పిల్లలు పుట్టినట్టు పలువురు పిర్యాధు చేశారు.. అయితే బాగానే ఉన్నా ఇరవై ముప్పై సంవత్సరాల పాటు ఒకరిని తండ్రి అనుకుని జీవించిన వారు అసలు తండ్రి వేరని తెలవడంతో కుమిలి పోతున్నట్టు తెలిపారు. ముఖ్యంగా వారి తండ్రులు కూడ చాల ...దీని ద్వార తమ కుటుంభాల్లో
డాక్టర్ వీర్యంతోనే 11 మంది పిల్లలు...
అయితే రెబెక్కా డిక్సన్ అనే మహిళ తమ కుటుంభానికి సంబంధించి లైఫ్ సైకిల్ గురించి పరిశోధనలు మొదలు పెట్టింది.. దీంతో ఆమే అసలు విషయాన్ని తెలుసుకుంది..ప్రస్తుతం తాను తండ్రి అనుకుంటున్న వారి రక్త నమూన కాకుండా తనకు ప్రాణం పోసిన డాక్టర్ తన తండ్రి అని గుర్తించింది..ఆమే తన వీర్యానికి బదులుగా డాక్టర్ బెర్నార్డ్ వీర్యంతో పుట్టినట్టుగా దృవీకరించుకుంది. దీంతో డాక్టర్ మోసం బయటపడింది..ఈ నేపథ్యంలోనే ఆయన పై పిర్యాధు చేసింది.. ..ఇలా పిర్యాధు చేయడం ద్వార ప్రభుత్వం విచారణ చేపట్టింది..ఇక విచారణలో బెర్నార్డ్ వీర్యం పంపీణిల్లో పలు మోసాలు చేసినట్టు తేలింది.. వందలాదీ మందికి వీర్యం మార్పిడి చేసినట్టు ఒప్పుకున్నాడు..ఈనేపథ్యంలోనే ఆయనపై సుమారు 100 మంది వరకు పిర్యాధు చేశారు..ఇలా ఆయన వీర్యం ద్వార ఇప్పటి వరకు 11 మంది పుట్టినట్టు లేక్క తేల్చారు... దీంతో ఆయన నడుపుతున్న ఫర్టిలిటీ కేంద్రాన్ని అంటారియో డిసిప్లీనరీ ప్యానెల్ రద్దు చేసింది.