మధ్యదరా సముద్రంలో పడవ మునక: 700 మంది గల్లంతు
మధ్యధరా సముద్రంలో వలసకూలీలతో ప్రయాణిస్తున్న ఓ నౌక మునిగిపోయింది. అందులో దాదాపు ఏడువందల మంది కూలీలు ఉన్నారని సమాచారం. ఈ నౌక మునిగిపోవడంతో వారందరూ గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
వలస కూలీలను కాపాడేందుకు లిబియా జలాలలోని లాంపడూస తీరానికి 130 మైళ్ల దూరంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇటలీకి చెందిన నౌకలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇరవై ఎనిమిది మంది కూలీలను కాపాడినట్లుగా తెలుస్తోంది.

కాగా, నౌకలో ఏడువందల మంది కంటే ఎక్కువ మందే ఉండవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా, ఇటీవలే మధ్యదరా సముద్రంలో నౌక ముక్కలైన విషయం తెలిసిందే. అది జరిగి వారం కాకముందే మరో ప్రమాదం జరగడం గమనార్హం.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications