గల్ఫ్ లో అమెరికా డేటా సెంటర్లపై దాడుల వెనుక..!ఇరాన్ వ్యూహమిదేనా ?
అమెరికా-ఇజ్రాయెల్ తమ దేశంపై దాడులు ప్రారంభించగానే.. గల్ఫ్ దేశాల్లోఉన్న వారి బేస్ లు, ఇతర ఆస్తులపై ఇరాన్ (iran) ప్రతీకార దాడులు చేపట్టింది. ఇందులో సైనిక బేస్ లు, సామాగ్రిపై దాడులు ఒక ఎత్తు.. అమెరికా డేటా సెంటర్లపై చేస్తున్న దాడులు మరో ఎత్తుగా మారాయి. ఇవి కేవలం ప్రతీకార దాడులుగా కనిపించడం లేదని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. వీటి వెనుక అంతకు మించిన వ్యూహం ఉందంటున్నారు.
ఇరాన్ టార్గెట్ లో డేటా సెంటర్లు (Iran)
ఇరాన్ దాడులలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు చెందిన యూఏఈ, బహ్రెయిన్లోని డేటా సెంటర్లు లక్ష్యంగా మారాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా డేటా సెంటర్లపై ఇరాన్ చేపట్టిన ఈ దాడులు ఆధునిక యుద్ధ వ్యూహాలు ఎలా మారాయో, సాంకేతికత కూడా ఎలా ప్రధాన లక్ష్యంగా మారిందో వెల్లడిస్తున్నాయి. ఈ దాడులు యాదృచ్ఛికంగా కాకుండా, వ్యూహాత్మక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి, ఇది ఆధునిక యుద్ధంలో ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసింది. "డేటానే కొత్త చమురు" అనే పాత సామెత నిజమని ఇక్కడ మరోసారి రుజువైంది. డేటానే కొత్త చమురు అయితే, డేటా సెంటర్లు దానికి సంబంధించిన శుద్ధి కర్మాగారాలు.

డిజిటల్ టార్గెట్
ఈ డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు, ఇరాన్ సౌదీ చమురు దిగ్గజం అరామ్కోకు చెందిన ఒక శుద్ధి కర్మాగారంపై దాడి చేసింది. ఈ రెండు దాడులు గల్ఫ్ ప్రాంత ఆర్థిక, డిజిటల్ మౌలిక సదుపాయాలను దెబ్బతీసే లక్ష్యంతో జరిగాయి. ఈ దాడులకు ముందు అమెరికా, ఇజ్రాయెల్ ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో సహా ఉన్నత స్థాయి నాయకత్వాన్ని అంతం చేశాయి. ఈ దాడులలో ఇరాన్కు చెందిన రక్షణ కమాండ్, నియంత్రణ కేంద్రం కూడా ధ్వంసమైంది. దీంతో ముందే నిర్ణయించుకున్న టార్గెట్ల మేరకు యుద్దాన్ని ఇరాన్ ముందుకు తీసుకెళ్తోంది.
పెట్టుబడుల కట్టడే లక్ష్యం
బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిన డేటా సెంటర్లు ఇరాన్ దాడులకు ప్రధాన లక్ష్యాలుగా మారాయి. ఎందుకంటే వ్యాపార మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం అనేది ఏదైనా యుద్ధంలో ముఖ్యమైన లక్ష్యాలలో ఒకటి. పెద్ద టెక్ సైట్లను లక్ష్యంగా చేసుకోవడానికి మూడు ప్రధాన కారణాలు ఉండవచ్చు. వ్యాపార పెట్టుబడులను దెబ్బతీయడం, సమాచారానికి సంబంధించిన మిలటరీ కార్యకలాపాలకు నష్టం కలిగించడం, ఈ డేటా సెంటర్లపై ఆధారపడిన అనేక వ్యాపార సంస్థలను ప్రభావితం చేయడం. ఈ క్లౌడ్ సేవలపై దాడుల కారణంగా అమెజాన్ విద్యుత్ అంతరాయాలు, నిర్మాణపరమైన నష్టాలను ఎదుర్కొంది. దీంతో డేటా సెంటర్లలోని కొన్ని భాగాలను మూసేయాల్సి వచ్చింది. ఇరాన్ దాడి తర్వాత ప్రీమార్కెట్ ట్రేడింగ్లో అమెజాన్ షేర్లు 2.7 శాతం పడిపోయాయి. మధ్యప్రాచ్యంపై భారీ పెట్టుబడులు పెట్టిన టెక్ కంపెనీల విశ్వాసాన్ని ఈ దాడి దెబ్బతీసింది.

ఏఐ డేటా వాడుకోకుండా అడ్డుకట్ట
మరోవైపు మిలటరీ కార్యకలాపాలలో ఏఐ వినియోగాన్ని అరికట్టడానికే ఇరాన్ ఈ డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్పై జరిగిన దాడుల ప్రణాళికలో అమెరికా సైన్యం ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐని వాడింది. ఏఐ వినియోగం లక్ష్యాలను తగ్గించడంలో, దాడుల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడిందని నిపుణలు చెప్తున్నారు. అలాగే యుద్ధంలో ఏఐని వాడినందుకు అమెరికాపై ప్రతీకారంగా ఇరాన్ అమెజాన్ డేటా సెంటర్లపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గల్ఫ్లో అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు మరింత సైనిక కార్యకలాపాలు నిర్వహించడానికి స్థానిక సమాచార సేకరణను నిలిపివేసే ప్రయత్నంగా ఇరాన్ దాడి చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
-
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
"ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం" -
ల్యాప్టాప్ అవసరం లేకుండానే మొబైల్లోనే ఆఫీస్ వర్క్..! -
భారత్కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
Lockdown: లాక్ డౌన్ ఎక్కడంటే ?- పార్లమెంట్ లో తేల్చేసిన ఆర్థికమంత్రి..! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications