వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియాలో ఇండియన్ రెస్టారెంట్‌పై వ్యక్తి కాల్పులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ ఇండియన్ రెస్టారెంటు పైన కాల్పులు జరిపారు. సిడ్నీ సమీపంలో ఉన్న ఇండియన్ ఈటర్ యాన్ అనే రెస్టారెంట్ పైన దుండగుడు ఈ కాల్పులకు తెకబడ్డాడు.

రెస్టారెంట్ రద్దీగా ఉన్న సమయంలో కిటికీలో నుంచి కాల్పులు జరిపాడు. ఇటీవలి కాలంలో భారతీయులే లక్ష్యంగా దాడి జరగడం ఇది రెండోసారి. నీలి రంగు దుస్తులు ధరించి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి, అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ ఘటన జరిగినప్పుడు రెస్టారెంటులో దాదాపు నలభై మంది ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. ఈ సంఘటన రాత్రి తొమ్మిది గంటల సమయంలో జరిగిందని పోలీసులు చెప్పారు.

Gunman fires shot through front window of Billu's Indian restaurant

ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరన్న విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అతను కాల్పులు జరిపి పారిపోయే సమయంలో విగ్రామ్ వీధి వద్ద ఓ మహిళను తోసుకుంటూ పారిపోయాడు. అతనిని ఆ మహిళ చూసి ఉంటుందని భావిస్తున్న పోలీసులు, ఆమె నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాల్పుల ఘటన సమయంలో 30 నుంచి 40 మంది వరకు స్టాఫ్, కస్టమర్లు ఉన్నారని పోలీసులు చెప్పారు.

English summary
Up to 40 people inside a busy Indian restaurant in Sydney's west were "extremely lucky" not to be injured when a gunman fired a shot through the front window, police say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X