బ్రహ్మపుత్ర నీటిని చైనా అడ్డుకుంటే..మాకే లాభం-పాక్ కు భారత్ షాకింగ్ కౌంటర్..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పక్కనబెట్టింది. దీంతో పాకిస్తాన్ కు నీటి కరవు తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. అదే చైనా కూడా మీలాగే బ్రహ్మపుత్ర నీటిని నిలిపేస్తే అప్పుడు ఏం జరుగుతుందని ప్రశ్నిస్తోంది. ఈ వాదనపై అంతర్జాతీయంగా కూడా చర్చ జరుగుతోంది. దీంతో భారత్ వైపు నుంచి తొలిసారి పాకిస్తాన్ వాదనకు గట్టి కౌంటర్ పడింది.
సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం వల్ల తమపై ప్రభావం పడుతుందని, కానీ బ్రహ్మపుత్ర నీటిని చైనా కూడా ఇలాగే నిలిపేస్తే మీ మీద ప్రభావం పడుతుంది కదా అంటూ పాకిస్తాన్ చేస్తున్న వాదనకు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ మాట విని బ్రహ్మపుత్ర నీటిని చైనా అడ్డుకున్నా భారత్ కు ఎలాంటి నష్టం జరగబోతందంటూ లెక్కలతో సహా అసోం సీఎం ఓ ట్వీట్ చేశారు. ఇందులో భారత్ పై బ్రహ్మపుత్ర నీటి ప్రభావం ఎంతో తేల్చిచెప్పేశారు.

చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపివేస్తే జరిగే నష్టమేమీ లేదని అసోం సీఎం గణాంకాలతో సహా వెల్లడించారు.
బ్రహ్మపుత్ర భారతదేశంలో పెరిగే నది అని, ఇది ఎప్పటికీ ఇంకి పోదని ఆయన తెలిపారు. బ్రహ్మపుత్ర మొత్తం ప్రవాహంలో చైనా వాటా కేవలం 30-35 శాతం మాత్రమే అన్నారు. అదీ ఎక్కువగా హిమనీ నదాలు కరగడం, పరిమిత టిబెట్ వర్షపాతం ద్వారా మాత్రమే చైనా నుంచి నీరు ఇందులో చేరుతుందన్నారు.మిగిలిన 65-70 శాతం నీరు భారత్ లోనే ఉత్పత్తి అవుతుందన్నారు.

అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయలో కుండపోత రుతుపవనాల వర్షపాతం, సుబంసిరి, లోహిత్, కమెంగ్, మానస్, ధనసిరి, జియా-భరాలి, కోపిలి వంటి ప్రధాన ఉపనదులు, ఖాసీ, గారో, జైంతియా కొండల నుండి కృష్ణా, దిగారు, కుల్సి వంటి నదుల ద్వారా అదనపు ప్రవాహాలు వచ్చి చేరుతాయన్నారు. ఇండో-చైనా సరిహద్దు వద్ద (ట్యూటింగ్): ప్రవాహం 2 వేల నుంచి 3 వేల క్యూబిక్ మీటర్లు, అస్సాం మైదానాలలో (ఉదా., గౌహతి) వర్షాకాలంలో ప్రవాహం 15 వేల నుంచి 20 వేల క్యూసెక్కుల వరకూ పెరుగుతుందన్నారు.
What If China Stops Brahmaputra Water to India?
— Himanta Biswa Sarma (@himantabiswa) June 2, 2025
A Response to Pakistan’s New Scare Narrative
After India decisively moved away from the outdated Indus Waters Treaty, Pakistan is now spinning another manufactured threat:
“What if China stops the Brahmaputra’s water to India?”…
కాబట్టి బ్రహ్మపుత్ర నీరు భారత్ లో ప్రవాహాలపైనే ఆధారపడి ఉందన్నారు. ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ అని, భారత భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత బలపడుతుందని గుర్తుచేశారు. పాకిస్తాన్ తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే చైనా నీటి ప్రవాహాన్ని తగ్గించినప్పటికీ (చైనా ఎప్పుడూ బెదిరించలేదు లేదా ఏ అధికారిక వేదికలోనూ సూచించలేదు), వాస్తవానికి అది అస్సాంలో వార్షిక వరదలను తగ్గించడానికి భారతదేశానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ వరదలు ప్రతి సంవత్సరం లక్షలాది మందిని నిర్వాసితులను చేసి జీవనోపాధిని నాశనం చేస్తున్నాయని గుర్తుచేశారు.
-
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications