కువైట్లో భారీ అగ్ని ప్రమాదం: 41 మంది మృతి, వీరిలో ఎక్కువమంది భారతీయులు
కువైట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 41 మంది మరణించారు. మరో 50 మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. మరణించిన వారిలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని తెలిసింది. కువైట్లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో ఈ ఘోర అగ్ని ప్రమాద ఘటన జరిగింది.
బుధవారం తెల్లవారుజామున హౌసింగ్ వర్కర్స్లోని ఆరంతస్తుల భవనంలోని ఓ వంటగది నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. క్రమంగా భవనం మొత్తం వ్యాపించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి వచ్చాయని చెప్పారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు .

కాగా, ఈ భవనంలో సుమారు 160 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వారిలో భారతీయులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన కువైట్ ఉప ప్రధాని ఫహాద్ యూసఫ్ అల్ సబా.. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు . భవనం యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. భవనం యజమానిని, ఈ ప్రమాదానికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు.
#Kuwait Mangaf Fire: Initial causes indicate poor storage on the ground floor and the presence of many gas cylinders, Firefighters, MOI and MOH to assess the deaths and injuries.. #الكويت pic.twitter.com/LNCpkhZdae
— Ayman Mat News (@AymanMatNews) June 12, 2024
కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 40 మందికిపైగా మరణించారని, మరో 50 మందికిపైగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే కువైట్లోని భారత ఎంబసీ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారని, బాధితులకు పూర్తి సహకారం అందజేస్తామని తెలిపారు. ప్రమాదంపై కువైట్ అధికారుల నుంచి మరింత సమాచారం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు.
Deeply shocked by the news of the fire incident in Kuwait city. There are reportedly over 40 deaths and over 50 have been hospitalized. Our Ambassador has gone to the camp. We are awaiting further information.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 12, 2024
Deepest condolences to the families of those who tragically lost…
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications