స్వీట్లు పంచుకున్న భారత్, పాక్: మోడీ శుభాకాంక్షలు

వందలాది మంది ముస్లింలు చండీగఢ్, ఇతర మసీదులలో ప్రార్థనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చారిత్రక మక్కా మసీదులో ముస్లీం సోదరులు ప్రార్థనలు చేశారు. ఈ రోజుతో రంజాన్ మాసం ముగుస్తోంది.
మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇంటికి వెళ్లి ఆయనకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అలీ నివాసానికి కేసీఆర్తో పాటు మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, పద్మారావు, ఎంపీలు కవిత, కేకేలు హాజరయ్యారు.
మోడీ శుభాకాంక్షలు
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ రోజు ప్రజల మధ్య శాంతిని, సోదరభావాన్ని, ఐకమత్యాన్ని పెంపొందించాలని కోరుకుంటున్నట్టు ట్లిట్టర్లో తెలిపారు.












Click it and Unblock the Notifications