శత్రుత్వం వీడి, కలిసి రావాలి: భారత్కు పాక్ ఆర్మీ కమాండర్
పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ భారత దేశానికి స్నేహ సందేశం పంపించారు. ఇరు దేశాలు శతృత్వం వీడి ఆర్థిక అభివృద్ధికి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ భారత దేశానికి స్నేహ సందేశం పంపించారు. ఇరు దేశాలు శతృత్వం వీడి ఆర్థిక అభివృద్ధికి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ ఆర్మీ సదరన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అమీర్ రియాజ్ బుధవారం క్వెట్టాలోని బెలూచిస్తాన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా చేపడుతున్న ఎకనామిక్ కారిడార్లో భారత్ కూడా భాగస్వామ్యం కావాలన్నారు. బెలూచిస్తాన్ బాగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. స్వీయ నిర్బంధంలో ఉన్న నేతల మాటలతో ప్రజలు తప్పుదారి పట్టవద్దన్నారు.
బెలూచిస్తాన్ అభివృద్ధిని శత్రుదేశాలు గుర్తించలేకపోతున్నాయన్నారు. పాకిస్తాన్, చైనా కారిడార్లో భారత్తో పాటు ఆప్ఘనిస్తాన్, ఇరాన్, మధ్య ఆసియా దేశాలు పాల్గొనాలన్నారు. ఆ ఫలాలు అందరికీ దక్కేలా చూడాలన్నారు. పాక్ వ్యతిరేక కార్యక్రమాలను పక్కన పెట్టడం ద్వారా భారత్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, వాటి ఫలాలు అందుకోవాలన్నారు.