భారత్ చైనాలో కలుస్తుందని..: 'ఇండియా టుడే' కవర్ ఫోటోపై చైనాలో రచ్చ
భారత్కు చెందిన ప్రముఖ మేగజైన్ ఇండియా టుడే కవర్ పేజీపై చైనాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ సోషల్ మీడియా వైబో వేదికగా ఇండియా టుడేపై మండిపడుతున్నారు.
బీజింగ్: భారత్కు చెందిన ప్రముఖ మేగజైన్ ఇండియా టుడే కవర్ పేజీపై చైనాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ సోషల్ మీడియా వైబో వేదికగా ఇండియా టుడేపై మండిపడుతున్నారు.
చైనాస్ న్యూ చిక్ పేరుతో కథనం
ఇండియా టుడే పత్రిక కవర్ పేజీపై ప్రచురించిన చైనా, పాకిస్తాన్ జాతీయ పతాకాలు ఇందుకు కారణం. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో చైనాస్ న్యూ చిక్ పేరుతో కవర్ పేజీ కథనం ప్రచురించింది ఇండియా టుడే.
చైనాను కోడిలా, పాక్ను కోడిపిల్లలా
ఇందుకు ఓ ఫోటోను పెట్టింది. చైనా పటాన్ని కోడిలా, పాక్ పటాన్ని కోడిపిల్లలా అందులో చూపించింది. దీనిపై చైనాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమను కోడిలా చూపించినందుకు కాకుండా.. చైనా పటంలో టిబెట్, తైవాన్లు లేవంటూ మండిపడుతున్నారు.
ఇండియా చైనా పటంలో కలుస్తుందని
ముందు మీరు చైనా భూభాగం ఎంతో తెలుసుకోవాలని చైనీయులు కామెంట్లు పెట్టారు. త్వరలోనే ఇండియా కూడా చైనా పటంలో కలుస్తుందని కొందరు హద్దు మీరి మాట్లాడారు.
చైనా తగ్గాలని ఇండియా టుడే, తైవాన్ సంబరం
ఈ వివాదంపై ఇండియా టుడే స్పందించింది. చైనీయులు తగ్గాలని, న్యూయార్క్కు చెందిన ది సొసైటీ ఆఫ్ పబ్లికేషన్స్ డిజైనర్స్ ఈ ఫోటోను ఫోటో ఆప్ ది డేగా గుర్తించిందని పేర్కొంది. కాగా, ఈ ఫోటోపై తైవాన్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలైన చైనా పటం ఇదేనని కామెంట్లు పెడుతున్నారు.