అమెరికా రెస్టారెంట్లో భార్యను చంపిన భారతీయ వ్యక్తి, 2వేల డాలర్ల రివార్డ్
వాషింగ్టన్: అమెరికాలోని మేరీల్యాండ్లోని బాల్టీమోర్లో భారత సంతతికి చెందిన వ్యక్తి తన భార్యను హతమార్చి పారిపోయినట్లుగా సమాచారం. అతను తన భార్యను డున్కిన్ డోనట్స్ రెస్టారెంటులోని కిచెన్ గదిలో హతమార్చాడని సమాచారం. భార్యాభర్తలు ఇద్దరు కూడా అదే రెస్టారెంటులో పని చేస్తున్నారు. భర్త వయస్సు 24. భార్య వయస్సు 21.
21 ఏళ్ల పాలక్ బద్రేష్ కుమార్ పటేల్ రెస్టారెంటులోని కిచెన్ గదిలో విగత జీవిగా పడి ఉన్నారు. దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా మృతికి ఆమె భర్త బద్రేష్ కుమార్ చేతన్ భాయి కారణమని అనుమానిస్తున్నామని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.
భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతనిని పట్టుకునేందుకు పోలీసులు స్థానికుల సహాయం తీసుకుంటున్నారు. ఈ ఘటన డొమెస్టిక్ గొడవ వల్లనే జరిగి ఉంటుందని భావిస్తున్నామని, యాధృచ్ఛికంగా జరిగింది కాదని అనుమానిస్తున్నామని పోలీసులు చెప్పారు.
భార్యాభర్తలు ఇద్దరు రెస్టారెంటు సమీపంలోనే ఉంటారు. ఆదివారం రాత్రి పదకొండు గంటలకు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. ఓ కస్టమర్ దీనిని గుర్తించాడు. దీనిని అక్కడి ఉద్యోగులు ఎవరు కూడా గుర్తించలేదని సమాచారం.
తాము ఇక్కడ అధికారులమని, ఓ అధికారి ఇక్కడకు వచ్చి భార్య విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారని ముల్కాహీ అనే అధికారి చెప్పారు. భర్తను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, అనుమానితుడైన భర్త గురించి సమాచారం ఇస్తే 2,000 డాలర్లు రివార్డ్ ఇస్తామని మెట్రో క్రైమ్ స్టాప్ అధికారులు చెప్పారు.