అమెరికాలో కాల్పులు: ఇండియన్ అమెరికన్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
వాషింగ్టన్: అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. జార్జియాలోని రెండు స్టోర్లలో ఓ దుండుగు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయ అమెరికన్ మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్జియాలోని బర్నెట్ ఫెర్నీ రోడ్లో గల హైటెక్ క్విక్ స్టాప్ స్టోర్లోకి ఓ వ్యక్తి తుపాకీతో వచ్చాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే స్టోర్లోని కౌంటర్ వద్ద నిల్చున్న పరంజిత్ సింగ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

ఆ తర్వాత అక్కడ్నుంచి పక్కనే ఉన్న మరో స్టోర్లోకి వెళ్లి కౌంటర్ వద్ద డబ్బును దొంగలించాడు దుండగుడు. ఈ సమయంలో అక్కడేవున్న స్టోర్లో పనిచేస్తున్న పార్థీ పటేల్పై కాల్పులు జరిపాడు. దీంతో పార్థీ తీవ్రంగా గాయపడ్డాడు.
అనంతరం పారిపోతున్న దుండగుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనూ పలు నేరాలకు పాల్పడిన లమర్ రషద్ నికోల్సన్గా దుండగుడ్ని గుర్తించారు. ఘటనపై అతడ్ని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications