ట్రంప్ టీంలో భారత సంతతి వ్యక్తి ఉత్తమ్ థిల్లాన్కు కీలక పదవి
వాషింగ్టన్: భారత సంతతి వ్యక్తి ఉత్తమ్ థిల్లాన్కు అమెరికా అధ్యక్షులుడొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో కీలక పదవి లభించింది. వైట్ హౌస్లో టాప్ లాయర్గా ఉన్న అతనిని కీలకమైన డ్రగ్ ఎన్ఫోర్సుమెంట్ ఏజెన్సీకి నూతన చీఫ్గా నియమించారు.
ఈ ఏజెన్సీ అమెరికాలో డ్రగ్స్ స్మగ్లింగ్, మత్తు పదార్థాల వాడకాన్ని నియంత్రిస్తుంది. ముప్పై ఏళ్ల సర్వీసు అనంతరం రాబర్ట్ పాటర్సన్ పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో నియమించారు.

ఉత్తమ్ థిల్లాన్ ట్రంప్కు డిప్యూటీ కౌన్సెల్, డిప్యూటీ అసిస్టెంట్గా పని చేశారు. ఇఫ్పుడు డ్రగ్ ఎన్ఫోర్సుమెంట్ ఏజెన్సీ తాత్కాలిక డైరెక్టరుగా బాధ్యతలు తీసుకున్నారు.
డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా అమెరికాలో ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని, అమెరికా తీవ్రమైన డ్రగ్ సమస్యతో బాధపడుతోందని అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెసియన్స్ అన్నారు. డ్రగ్ నియంత్రణ కమిటీ దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications