గాల్లోనే గాలిలో కలిసిపోయిన నిండు ప్రాణాలు: మృతుడు భారత సంతతి వ్యక్తి
అబుదాబి: న్యూఢిల్లీ నుంచి మిలాన్ వెళుతున్న విమానంలో భారత్కు చెందిన వ్యక్తి హఠాన్మరణం పొందడంతో పైలట్లు విమానంను అబుదాబి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాడింగ్ చేశారు. ఈ ఘటన సోమవారం జరిగింది. మృతి చెందిన వ్యక్తిని 52 ఏళ్ల కైలాష్ చంద్ర సైనీగా గుర్తించారు. ఇటలీలో నివసిస్తున్న కైలాష్ చంద్ర రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవాడని అధికారులు తెలిపారు.
ఇక మిలాన్కు కైలాష్ చంద్రతో పాటు అతని కొడుకు హీరాలాల్ సైనీ కూడా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం అబుదాబిలోని భారత ఎంబసీ కైలాష్ మృతదేహాన్ని భారత్కు పంపేందుకు అన్ని విధాలా సహకరిస్తోంది. ఇందుకు కావాల్సిన మొత్తం డాక్యుమెంట్స్ను దగ్గరుండి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అన్ని లాంఛనాలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఇక న్యూఢిల్లీలోని అధికారులతో చర్చలు జరుపుతున్నామని అబుదాబిలోని భారత ఎంబసీలో అధికారులు తెలిపారు.

అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో సోమవారం అర్థరాత్రి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యిందని భారత ఎంబసీ అధికారి రాజమురుగన్ చెప్పారు. ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న మఫ్రఖ్ హాస్పిటల్కు మృతదేహాన్ని తరలించామని చెప్పారు.అబుదాబి అధికార యంత్రాంగం ఇప్పటికే డెత్ సర్టిఫికేట్ జారీ చేసిందని ఆఫీసర్లు తెలిపారు.ఇతిహాద్ విమానంలో తన తండ్రి మృతదేహం తీసుకుని భారత్కు హీరాలాల్ చేరుకుంటారని అధికారులు వివరించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications