వదలని పెను భూకంపాలు: సరిగ్గా 9వ రోజు నాడే మళ్లీ: అల్లాడిన చిరు ద్వీపం
Indonesia earthquake: ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. కొత్త ఏడాది ప్రారంభంలోనే పెను భూకంపం, అదే స్థాయిలో సునామీని చవి చూడాల్సి వచ్చింది. సరిగ్గా తొమ్మిది రోజుల వ్యవధిలో మరోసారి పెను భూకంపం సంభవించింది. ఓ చిన్న ద్వీప సముదాయాన్ని వణికింపజేసింది.
జనవరి 1వ తేదీన జపాన్లో సంభవించిన పెను భూకంపం, ఆ వెంటనే ఏర్పడిన సునామీ వల్ల 161 మంది మరణించిన విషయం తెలిసిందే. పలువురు గల్లంతయ్యారు. భవనాల శిథిలాల కింద వారంతా చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికీ ఆ దేశ పశ్చిమ తీర ప్రాంతంలోని ఇషికవా ప్రీఫెక్షర్ రీజియన్ తేరుకోవట్లేదు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

జపాన్ భూకంపం మిగిల్చిన విషాదం నుంచి తేరుకోక ముందే ఇప్పుడు ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా రికార్డయింది. ఈ తెల్లవారు జామున 2:18 నిమిషాలకు భూమి ప్రకోపించింది. ఇండోనేషియాలోని టాలండ్ ఐలండ్ను వణికించింది.
Tsunami Info Stmt: M7.0 Talaud Islands, Indonesia 1249PST Jan 8: Tsunami NOT expected; CA,OR,WA,BC,and AK
— NWS Tsunami Alerts (@NWS_NTWC) January 8, 2024
టాలండ్ ద్వీపం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఓ చిన్న ద్వీప సముదాయం కావడం, భూకంప తీవ్రత అధికంగా ఉండటం వల్ల సునామీ సంభవించవచ్చనే భయాందోళనలు తొలుత వ్యక్తం అయ్యాయి. ఆ తరువాత అలాంటి ప్రమాదమేమీ లేకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు.
ఈ భూకంపం వల్ల సునామీ సంభవించే ప్రమాదం లేదని నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది. ఇప్పటివరకు ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఎలాంటి వార్తలు అందలేదు. టాలండ్ ఐలండ్లో కొన్ని చోట్ల భవనాలకు బీటలు వారినట్లు తెలుస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారడం, తీరంలో అలలు పోటెత్తడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తీరప్రాంతాన్ని ఖాళీ చేయించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications