అనుమానమే పెనుభూతం సోదరి కళ్ళ గుడ్లు పీకి, కాళ్ళు నరికివేసిన సోదరులు
లాహోర్ :అనుమానం పెనుభూతమైంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన సోదరులే స్వంత చెల్లెలిని దారుణంగా హింసించారు. కళ్ళ గుడ్లు పీకేశారు. కాళ్ళు నరికారు. చావు బతుకుల మద్య ఆమె కొట్టుమిట్టాడుతోంది.
పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకొంది. అనుమానం కారణంగానే స్వంత చెల్లెలిని సోదరులే దారుణంగా చిత్రహింసలు పెట్టారు.సోదరుడి కుమార్తె కన్పించకపోవడమే ఈ దారుణానికి కారణమైంది. స్వంత చెల్లెలే తన కూతురును కిడ్నాప్ చేసిందని ఆమె సోదరుడు అనుమానించాడు.
ఈ అనుమానమే పెుభూతమైంది.మరో సాదరుడితో కలిసి స్వంత చెల్లిని కిడ్నాప్ చేశాడు.ఇద్దరూ కలిసి పదునైన కత్తితో ఆమె కళ్ళ గుడ్లను తీసివేశారు. కాళ్ళను నరికివేశారుు. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. భాదిత మహిళపైనే ఓ సోదరుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. తన కూతురును తన సోదరి కిడ్నాప్ చేసిందని ఆయన ఆరోపిస్తున్నాడు.