Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

US-Israel-Iran War: 1,230 మంది మృతి..

ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ప్రారంభమైన దాడులు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ సైతం ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులను తీవ్రతరం చేస్తోంది. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సైప్రస్, ఇరాక్‌, జోర్డాన్‌ తదితర దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అయితే ఈ దాడుల్లో ఇప్పటివరకూ దాదాపు 1200 మంది కంటే ఎక్కువే మృతి చెందినట్లు సమాచారం.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య జరుగుతున్న దాడుల్లో ఇప్పటివరకూ ఇరాన్ లో 1000 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. అలాగే లెబనాన్ లో 50 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్ లో 12 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. అలాగే యూఎన్ అందించిన సమాచారం ప్రకారం దాదాపు లక్ష మంది పౌరులు ఇరాన్ నుంచి వలస వెళ్లినట్లు పేర్కొంది. యుద్ధం ప్రారంభమైన 2 రోజుల్లోనే ఈ వలసలు స్టార్ట్ అయినట్లు వెల్లడించింది.

మరోవైపు ఇజ్రాయెల్ మరోసారి ఫ్రెష్ అటాక్స్ చేస్తోంది. ఇరాన్ లోని టార్గెట్ స్థావరాలపై దాడులకు పాల్పడుతోంది. అలాగే లెబనాన్, బీరట్ లోని హెజ్ బొల్లా స్థావరాలపైనా దాడులు చేస్తోంది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సరిహద్దులో ఉగ్రవాద కదలికలు నమోదవుతున్నాయని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్ సేత్.. యుద్ధం పరిధి విస్తరిస్తోందని అన్నారు. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ కు చెందిన యుద్ధనౌకను అమెరికా ముంచేసిందని తెలిపారు.

Iran Death Toll Crosses 1200 PM Modi Speaks to French President Macron Amid Escalating Crisis

ఇక లెబనాన్ లో ఇరాన్ కు చెందిన హెజ్ బొల్లా గ్రూప్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. అలాగే బహ్రెయిన్, కువైట్, ఇజ్రాయెల్ లో ఇరాన్ దాడులను తీవ్రతరం చేస్తోంది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచమార్కెట్ లో చమురు ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇరాన్, ఇజ్రయెల్- అమెరికా మధ్య యుద్ధం కారణంగా ఇరాన్.. హార్మూజ్​ జలసంధిని మూసివేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

మేక్రాన్ కు ప్రధాని మోదీ ఫోన్ కాల్..

ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యూయెల్ మేక్రాన్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ కాల్ లో మాట్లాడారు. పశ్ఛిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ త న అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. దౌత్యం, చర్చల ద్వారానే ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారం కావాలని అభిప్రాయపడినట్లు తెలిపారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు తమ మద్దతు ఉంటుందని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+