మొస్సాద్ తో లింక్స్- వారిని ఉరి తీసిన ఇరాన్..!!
ఇజ్రాయెల్ తో భీకర యుద్ధాన్ని కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థుల్లో ఇరాన్ దిగ్భ్రాంతికర చర్య తీసుకుంది. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయనే కారణంతో ముగ్గురిని ఉరి తీసింది. ఇరాన్ లోని పశ్చిమ ప్రాంతం లోని అజర్ బైజాన్ ప్రావిన్స్ లో గల ఉర్మియా జైలులో ఈ ఉరిశిక్షలు అమలు జరిగాయి.
ఈ నెల 13వ తేదీన ఇజ్రాయెల్ తో యుద్దం ఆరంభమైన తరువాత ఉరిశిక్షను అమలు చేయడం ఇది రెండోసారి. ఈ రెండు వారాల వ్యవధిలో మొత్తంగా ఆరుమంది ఖైదీలను ఉరి తీసినట్టయింది. తొలి విడతలో ఇదే ఉర్మియా కారాగారంలో ముగ్గురికి మరణశిక్ష విధించింది ఇరాన్ ప్రభుత్వం. తాజాగా మరో ముగ్గురిని ఉరి కంబం ఎక్కించింది.

ఇరాన్ ఈ మరణశిక్షను అమలు చేసినట్లు ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ వెల్లడించింది. ఆ దేశ న్యాయ మంత్రిత్వ శాఖ, పోలీసు ఉన్నతాధికారులను ఉటంకిస్తూ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఉరిశిక్షను ఎదుర్కొన్న వాళ్లు తమ దేశంలోకి హత్యా సామగ్రిని తీసుకువచ్చారని పేర్కొంది.
గతంలో ఇజ్రాయెల్ నుంచి దాడులు ఎదుర్కొన్నప్పుడు ఇరాన్ అనేకసార్లు ఉరిశిక్షలను అమలు చేసింది. తాజా యుద్ధం ఆరంభమైన తరువాత కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. ఈ రెండు వారాల వ్యవధిలో ఆరుమందిని ఉరికొయ్యకు వేలాడదీసినట్టయింది. కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత కూడా మరణశిక్షలు అమలు కావడం పట్ల ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.
ఆజాద్ షోజై, ఇద్రిస్ ఆలీ, రసౌల్ అహ్మద్ రసౌల్ గా ఇరాన్ గుర్తించింది. వీరిలో రసౌల్ అహ్మద్.. ఇరాక్ జాతీయుడు. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ తో సంబంధాలు ఉన్నాయనే కారణంతో ఈ ముగ్గురినీ ఇదివరకే అరెస్ట్ చేసింది. తమ దేశ భద్రత సహా ఇతర సున్నిత సమాచారాన్ని మొస్సాద్ కు చేరవేస్తోన్నట్లు గుర్తించింది.
వీరిని కూడా ఇజ్రాయెల్ ఉరి తీయవచ్చని గతంలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేసింది. వారికి క్షమాభిక్ష పెట్టాలని విజ్ఞప్తి చేసింది గానీ అది సాధ్యపడలేదు. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి రాజీ ధోరణి ప్రదర్శించదలచుకోలేదని ఇరాన్ స్పష్టం చేసింది. శత్రు దేశానికి రహస్య, సున్నిత సమాచారాన్ని చేరవేసే వారికి మరణశిక్ష తప్పదనీ హెచ్చరించింది.
-
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
యుద్ధం ఎఫెక్ట్: కుప్పకూలిన గుడ్డు ధరలు! -
విసాలపై ఖుషీ న్యూస్ -
ఇరాన్ ఇక చేతులెత్తేయాల్సిందే! డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!! -
వాటర్ బాటిల్స్ ను తాకిన వార్ హీట్. మంచినీళ్లూ కొనలేమా? -
US Refueling Aircraft Crash: ఇరాన్ వార్ లో అమెరికాకు అతిపెద్ద షాక్..! -
తల తెగినా పోరాడే సైన్యం! అమెరికాను వణికిస్తున్న జఫారీ! -
యుద్ధంలోనూ కొత్త శకం.. డ్రోన్లతో వార్, పశ్చిమాసియాలో 10వేల అమెరికా మెరోప్స్ డ్రోన్లు! -
ఇరాన్ జీవనాడిపై అమెరికా దెబ్బ- ఓటమిని అంగీకరించిందని ట్రంప్ ప్రకటన -
ఖమేనీ ఆచూకీ చెప్పిన వారికి కోటి డాలర్లు -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications