ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే
ఇరాన్ తో చర్చలు విఫలమైన అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్) వార్ మోడ్ లోకి వెళ్లింది. ఇరాన్ పోర్టులను దిగ్బంధించనుంది. ఇప్పటికే ఇది అమలులోకి వచ్చింది. ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాలు, అరేబియన్ గల్ఫ్, ఒమాన్ గల్ఫ్లోని సముద్ర మార్గాలను ఉపయోగించుకునే అన్ని దేశాల నౌకలపై దిగ్బంధం కొనసాగుతుందని అమెరికా వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని తీసుకున్న ఈ నిర్ణయం ఇరాన్ వాణిజ్య జీవనరేఖను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఈ దిగ్బంధనం వల్ల ఇరాన్ ప్రతిరోజూ 435 మిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. భారతీయ కరెన్సీలో దీని విలువ రూ.4,000 కోట్లకు పైమాటే. ఇటువంటి ఆర్థిక నష్టం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

అమెరికా, ఇరాన్ల మధ్య గత వారం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో 21 గంటల పాటు జరిగిన శాంతి చర్చలు ఫలించలేదు. దీని పర్యవసనాన్ని ఇరాన్ చెల్లించాల్సి వస్తోంది. శాంతి చర్చలు విఫలం కావడంతో డొనాల్డ్ ట్రంప్ మరింత మరింత కఠిన వైఖరిని అనుసరిస్తోన్నారు. ఈ క్రమంలోనే ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల సంభవించే పరిణామాలపై అమెరికా విదేశాంగ శాఖ మాజీ ప్రతినిధి మియాద్ మాలెకీ ఇరాన్కు కలిగే ఆర్థిక ప్రభావాలను విశ్లేషించారు.
ఈ దిగ్బంధనం కారణంగా ఇరాన్కు రోజువారీ వాణిజ్యంలో 435 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారు. దిగ్బంధనం వల్ల ఇరాన్కు ప్రతిరోజూ ఎగుమతులలో సుమారు 276 మిలియన్ డాలర్లు, దిగుమతులలో 159 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఈ మొత్తం ఇరాన్ వార్షిక వాణిజ్యంలో 90 శాతం కంటే ఎక్కువ. దాదాపు 109.7 బిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ వాణిజ్య కార్యకలాపాలు పర్షియన్ గల్ఫ్ ద్వారానే జరుగుతుందని ఆయన తెలిపారు.
ఇరాన్ మొత్తం ఎగుమతుల ఆదాయంలో 80 శాతం దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో దాదాపు నాలుగో వంతు చమురు, గ్యాస్ రంగం నుంచే వస్తుంది. మాలెకీ ఈ పరిస్థితిని ఇరాన్ వాణిజ్య జీవనరేఖకు పెద్ద ప్రమాదంగా అభివర్ణించారు. ప్రస్తుతం, ఇరాన్ రోజుకు 1.5 మిలియన్ బారెళ్ల ముడి చమురును ఎగుమతి చేస్తూ, 139 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందుతోంది. అమెరికన్ నావికాదళ దిగ్బంధనంతో ఈ ఆదాయం ఒక్క రాత్రిలోనే నిలిచిపోతుంది. ముడి చమురు ఎగుమతుల్లో 92 శాతం వాటా ఉన్న ఖార్గ్ ద్వీపంపై కూడా దీని ప్రభావం పడుతుంది.
-
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
ఇరాన్ యుద్ధం వేళ భారత్-అమెరికా భారీ డీల్! -
ఆ ఇద్దరి రాకతో జాగ్రత్త పడ్డ ఇరాన్- అనుకున్నదంతా అయింది -
అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం- ఇకపై మరింత..!! -
వామ్మో.. నిమిషాల్లోనే రూ. 8 లక్షల కోట్లు హాంఫట్.. -
అమెరికాలో ‘తెలుగు’ అందాలు: చిలకలూరిపేట చిన్నది Vs కరీంనగర్ క్వీన్ -
కిలో బియ్యం రూ.600 - రూ.800.. కేజీ మాంసం రూ. 4000 పైనే !!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications