Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐఎస్ ఆత్మాహుది దాడులు: 213మంది మృతి

బాగ్దాద్‌: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో వరుస పేలుళ్లతో మారణకాండ సృష్టించారు. ఉగ్రదాడిలో సుమారు 120మంది ప్రాణాలు వదిలారు. రద్దీ ప్రదేశాల్లో జరిగిన ఈ బాంబు మరో 130 మందికిపైగా గాయపడ్డారు.

స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్దాద్ నగరంలోని రద్దీ ప్రాంతాలైన కరాదా, షల్లాల్‌ మార్కెట్‌ వద్ద ఉగ్రవాదులు పేలుళ్లకు తెగబడ్డారు. తొలుత కరాదా వద్ద కారులో వచ్చిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.

Iraq violence: IS bombing kills at least 80 in Baghdad

ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే షల్లాల్‌ మార్కెట్లో మరో పేలుడు సంభవించింది. రంజాన్‌ మాసం సందర్భంగా.. ముస్లింలు భోజనాలు చేస్తున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. ఘటనలో 120 మంది వరకు చనిపోయి ఉంటారని బాగ్దాద్‌ అధికారులు వెల్లడించారు.

కాగా, దాడి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఇస్లామిక్‌ ఉగ్రవాదుల అధీనం నుంచి ఫలూజా నగరాన్ని ఇరాకీ భద్రతాదళాలు వెనక్కి తీసుకున్న వారం రోజులకే ఈ దాడులు జరగడం గమనార్హం. క్షతగాత్రులను అధికారులు ఆస్పత్రులకు తరలించారు. పేలుళ్లతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.

213కు చేరిన మృతుల సంఖ్య

బాగ్దాద్‌లో జరిగిన పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం వరకు 120మంది మృతి చెందినట్లు తెలిపిన అధికారు.. సోమవారం ఈ సంఖ్యగా భారీగా పెరినట్లు చెప్పారు. ఈ బాంబు దాడిలో మృతుల సంఖ్య 213కు చేరినట్లు ఇరాక్‌ అధికారులు సోమవారం వెల్లడించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+