ఐఎస్ఐఎస్: సిగరేట్లు తాగారని.. చిత్రహింసలు పెట్టారు(వీడియో)
బాగ్దాద్: మానవ మృగాలైన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ సొంత జిహాదీలనే చావగొట్టారు. వారు చేసిన నేరం సిగరేట్లు తాగడమే. ఐఎస్ఐఎస్ నిబంధనల ప్రకారం.. తమ జిహాదీ గ్రూపులోని ఎవరూ కూడా సిగరేట్లు తాగకూడదు.
ఈ నిబంధనను ఉల్లంఘించి సిగరేట్లు తాగారని పలువురు జిహాదీలను సహచర జిహాదీ ఉగ్రవాదులు చిత్రహింసలకు గురిచేశారు. రక్తం వచ్చేలా కాళ్లతో తన్నుతూ, తుపాకీలతో కొట్టారు. ఈ దారుణ వీడియోను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు విడుదల చేశారు.
ఆ వీడియోలు చూపించిన ప్రకారం సిగరెట్ తాగిన కొందరు సొంత ఉగ్రవాదులనే వరుసగా ఓ గోడకు ఎదురుగా కూర్చోబెట్టి ఉంచారు.
కొందరు ముసుగు ధరించిన ఉగ్రవాదులు వారిపై కాళ్లు పెట్టి ఎక్కుతూ దిగుతూ కనిపించారు. అంతేకాకుండా వారి చేతుల్లోని తుపాకీ బ్యారెల్తో చితక్కొట్టుడు కొట్టారు.

మరొకరినైతే ఏకంగా తల బద్ధలయ్యేలా బాదారు. పిడిగుద్దులు కురిపించారు. పొగతాగడం ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకమని, పొగతాగడమంటే మెల్లగా ఆత్యహత్య(స్లో స్యూసైడ్)కు పాల్పడటమేనని వారు భావిస్తారట.
ఇకపై ఎవరు ఎలాంటి దిక్కార చర్యలకు దిగకూడదని వారిని క్రూరంగా హింసించినట్లు ఆ ఉగ్రవాద సంస్థ పేర్కొంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications