ఉగ్రవాదుల మారణహోమం... ఆ 2 గ్రామాల్లో 100 మందిని కాల్చి చంపారు...
పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్లో ఇస్లామిక్ తీవ్ర వాదులు రెచ్చిపోయారు. మాలి సరిహద్దులోని రెండు గ్రామాలపై కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు 100 మంది గ్రామస్తులను పొట్టనబెట్టుకున్నారు. అంతకుముందు ఇద్దరు బొకోహారమ్ ఉగ్రవాదులను స్థానికులు కొట్టి చంపడంతో దానికి ప్రతీకారంగా ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నైగర్ ప్రధాని బ్రిగి రఫినీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాల్పులు చోటు చేసుకున్న టోంబాంగౌ, జారౌమ్దరే గ్రామాలను ప్రధాని స్వయంగా సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మృతులకు సంతాపం ప్రకటించారు. ప్రస్తుతం ఆ గ్రామాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. కాల్పుల ఘటన జరిగిన రోజే అధ్యక్ష ఎన్నిక కోసం మరో విడత ఎన్నికలు జరపనున్నట్లు అక్కడి ఎన్నికల కమిషన్ ప్రకటించడం గమనార్హం.

అధ్యక్ష ఎన్నిక కోసం ఇప్పటికే ఓటింగ్కి జరగ్గా... 28 మంది అధ్యక్ష అభ్యర్థుల్లో ఎవరికీ మెజారిటీ దక్కలేదు. దీంతో మరోసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్దమైంది. మొత్తం 7.4మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.
కాగా,నైగర్లో చాలాకాలంగా ఇస్లామిక్ తీవ్రవాదులు నెత్తుటేరులు పారిస్తూనే ఉన్నారు. బొకొహారం,ఆల్ఖైదా సంబంధిత ఉగ్రవాద సంస్థలు మారణహోమం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వేలాది మంది నైగర్ ప్రజలు ఈ మారణహోమంలో బలైపోయారు.దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని కొన్నేళ్లుగా ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. బలవంతంగా ఎంతోమందిని ఉగ్రవాదులుగా మారుస్తున్నారు. గత నెలలో దిఫా ప్రాంతంపై దాడి చేసిన ఉగ్రవాదులు దాదాపు 27 మందిని కాల్చి చంపారు. నైగర్లో చోటు చేసుకుంటున్న ఈ మారణహోమంపై ఐరాస కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications