మసీదులో ఆత్మాహుతి దాడి: 13మంది మృతి
కువైట్ సిటీ: కువైట్ రాజధానిలోని షియా ముస్లింల వర్గానికి చెందిన మసీదులో ఆత్మాహతి దాడి జరిగింది. రంజాన్ సందర్భంగా నగరంలోని అల్-ఇమామ్-అల్-సాదిఖ్ మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది.
ఈ ఘటనలో 13 మంది మృతిచెందినట్లు సమాచారం. మరికొందరు గాయపడ్డారు. మసీదులో ప్రార్థనలు చేసుకుంటుండగా.. ఆత్మాహుతి బాంబర్ ప్రవేశించి తనకు తాను పేల్చుకోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

కాగా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. అబూ సులేమాన్ అనే ఆత్మాహుతి బాంబర్ ఈ పేలుడుకు పాల్పడినట్లు ఐఎస్ తెలిపింది.
షియా ముస్లింలను ఉద్దేశించి ‘టెంపుల్ ఆఫ్ రెజెక్షనిస్ట్' అనే పదాన్ని ఉపయోగించిన ఐఎస్.. ఈ దాడికి తామే పాల్పడినట్లు పేర్కొంది. ఇంతకుముందు కూడా షియా ముస్లింలే లక్ష్యంగా సౌదీ అరేబియా మసీదు, యెమన్లలో ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications