ఐసిస్ ఉగ్రవాదుల మిషన్ 2020లో ఇండియా కూడా
లండన్: అభివృద్ధి పథంలో దూసుకెళ్లేందుకు ఓ ఐదేళ్లో, పదేళ్లో కాలపరిమితి పెట్టుకుని 'మిషన్ 2020', 'మిషన్ 2025' అని పేర్లు పెట్టుకుని ప్రభుత్వాలు ముందుకెళ్లడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులూ మరింత ఆందోళనకు గురిచేసే ఓ మిషన్ నిర్దేశించుకున్నారు.
సాధ్యమైనన్ని ఎక్కువ దేశాల్లో ఇస్లామిక్ రాజ్యం సృష్టించాలని 'మిషన్ 2020'ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా 'ఉగ్ర' గొడుగు కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న జాబితా దేశాలతో కూడిన మ్యాప్ను విడుదల చేశారు.

వచ్చే ఐదేళ్లలో భారతదేశం, శ్రీలంక, మాల్దీవులు సహా మధ్య ప్రాచ్య దేశాలు, ఉత్తరాఫ్రికా, యూరప్లోని పలు ప్రాంతాలను తమ రాజ్యంగా చేసుకోవాలని ఐఎస్ఐఎస్ భావిస్తోంది.
ఈ దేశాల్లో షరియా చట్టాలు అమలు చేయాలని, పడమర స్పెయిన్ నుంచి, తూర్పు చైనా వరకూ విస్తరించాలని లక్ష్యాలను నిర్దేశించుకుంది. కాగా, ఐఎస్ఐఎస్ విడుదల చేసిన ఈ మ్యాప్ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications