ఐసిస్ ఉగ్రవాదుల మిషన్ 2020లో ఇండియా కూడా
లండన్: అభివృద్ధి పథంలో దూసుకెళ్లేందుకు ఓ ఐదేళ్లో, పదేళ్లో కాలపరిమితి పెట్టుకుని 'మిషన్ 2020', 'మిషన్ 2025' అని పేర్లు పెట్టుకుని ప్రభుత్వాలు ముందుకెళ్లడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులూ మరింత ఆందోళనకు గురిచేసే ఓ మిషన్ నిర్దేశించుకున్నారు.
సాధ్యమైనన్ని ఎక్కువ దేశాల్లో ఇస్లామిక్ రాజ్యం సృష్టించాలని 'మిషన్ 2020'ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా 'ఉగ్ర' గొడుగు కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న జాబితా దేశాలతో కూడిన మ్యాప్ను విడుదల చేశారు.

వచ్చే ఐదేళ్లలో భారతదేశం, శ్రీలంక, మాల్దీవులు సహా మధ్య ప్రాచ్య దేశాలు, ఉత్తరాఫ్రికా, యూరప్లోని పలు ప్రాంతాలను తమ రాజ్యంగా చేసుకోవాలని ఐఎస్ఐఎస్ భావిస్తోంది.
ఈ దేశాల్లో షరియా చట్టాలు అమలు చేయాలని, పడమర స్పెయిన్ నుంచి, తూర్పు చైనా వరకూ విస్తరించాలని లక్ష్యాలను నిర్దేశించుకుంది. కాగా, ఐఎస్ఐఎస్ విడుదల చేసిన ఈ మ్యాప్ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.
-
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే












Click it and Unblock the Notifications