వైమానిక దాడులు: 30 మంది ఐఎస్ ఉగ్రవాదులు అంతం
సిరియా: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులను అంతం చెయ్యడానికి అమెరికా బలగాలు రంగం సిద్దం చేస్తున్నాయి. ఇప్పటికే పలు సార్లు వైమానిక దాడులు జరిపి అనేక మంది ఐఎస్ఐఎస్ తీవ్రవాదులను అంతం చేశారు. శుక్రవారం జరిగిన వైమానిక దాడులలో 30 మంది తీవ్రవాదులు అంతం అయ్యారు.
శుక్రవారం అమెరికా వైమానిక దళాలు అలెప్పోకు సమీపంలోని రెండు ఉగ్రవాద స్థావరాల మీద బాంబుల వర్షం కురిపించాయి. ఒక స్థావరంలో ఉన్న 18 మంది, ఇంకోక స్థావరంలో ఉన్న 12 మంది ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అంతం అయ్యారు. పలువురు స్థానికులు గాయపడ్డారు.

బాంబుల దాడులు జరుగుతున్న సమయంలో స్థానికంగా నివాసం ఉంటున్న వారు ఇండ్ల నుండి బయటకు వచ్చి పరుగు తీశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిర్జనప్రదేశంలోకి వెళ్లారు. అత్యాచారాలు, శిరచ్చేదనాలు, లూటీలు, బాంబు దాడులు చేస్తున్న ఐఎస్ఐఎస్ అగడాలకు అడ్డు అదుపు లేకుండ పోయింది.
డమాస్కస్ సమీపంలోని రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నపల్ మీరా నగరాన్ని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు స్వాదీనం చేసుకున్నారు. ఈ నగరంలో ఉన్న పురాతన కట్టడాలు, పర్యాటక కేంద్రాలను ద్వంసం చేస్తామని శుక్రవారం ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హెచ్చరించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications