Israel-Palestine : ఇజ్రాయెల్ పై పాలస్తీనా మెరుపుదాడులు-కౌంటర్ అటాక్ ప్రారంభం
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య దశాబ్దాలుగా సాగుతున్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. తాజాగా గాజా స్ట్రిప్ నుంచి దాదాపు 5 వేల రాకెట్లు ఇజ్రాయెల్ పై విరుచుకుపడటం, మిలిటెంట్ల చొరబాట్లతో ఆ దేశం తీవ్రంగా స్పందించింది. పాలస్తీనాపై యుద్ధం ప్రకటన చేసింది. పాలస్తీనా మిలిటెంట్ల చొరబాటుతో పాటు తెల్లవారుజామున డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించడంతో ఒక మహిళ మృతిచెందింది.
పాలస్తీనా నుంచి తీవ్రమైన రాకెట్ దాడుల నేపథ్యంలో దేశంలో యుద్ధ ప్రకటన చేసిన ఇజ్రాయెల్ తమ పౌరుల్ని ఇళ్లలోనే ఉండాలని కోరింది. పాలస్తీనా నుంచి చాలా మంది ఉగ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడ్డారని సైన్యం పేర్కొంది. జెరూసలేంలో వైమానిక దాడి సైరన్లు మోగడంతో గాజా స్ట్రిప్లోని లక్ష్యాలను ఛేదిస్తున్నట్లు అది పేర్కొంది. ఇజ్రాయెల్ సరిహద్దు పట్టణమైన స్డెరోట్లో యూనిఫాం ధరించిన ముష్కరులుగా కనిపించిన వీడియోలు కలకలం రేపాయి. ఈ వీడియోలలో కాల్పుల శబ్దం వినబడుతోంది.

ఈ తెల్లవారుజామున 30 నిమిషాలకు పైగా సాగిన దాడుల్లో గాజాలో 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెల్ అవీవ్ వరకు గాలిలో రాకెట్ల శబ్దాలు వినిపించాయి, అలాగే సైరన్లు కూడా వినిపించాయి. దక్షిణ ఇజ్రాయెల్లోని ఓ భవనంపై రాకెట్ పడటంతో 70 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడినట్లు ఇజ్రాయెల్ వార్తా ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తున్న హమాస్ సైనిక విభాగ నాయకుడు మొహమ్మద్ డీఫ్.. ఇజ్రాయెల్పై కొత్త సైనిక చర్యను ప్రారంభించినట్లు చెప్పారు.

"ఆపరేషన్ అల్-అక్సా స్టార్మ్" ప్రారంభించడానికి శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై 5 వేల రాకెట్లను ప్రయోగించామని మహమ్మద్ డీఫ్ చెప్పారు. ఇజ్రాయెల్ను ఎదుర్కోవాలని పాలస్తీనియన్లందరినీ కోరారు. అనేక ఇజ్రాయెల్ హత్య ప్రయత్నాల నుండి బయటపడిన డీఫ్ సాధారణంగా బయట కనిపించరు. ఇప్పుడు కూడా ఆయన సందేశం రికార్డ్ విడుదల చేశారు.గాజాతో ఇజ్రాయెల్ సరిహద్దులో వారాలపాటు తీవ్ర ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో భారీ పోరాటాల తర్వాత ఈ రాకెట్ ప్రయోగాలు చోటు చేసుకున్నాయి.
-
ఇరాన్ కు జి7 దేశాల తీవ్ర హెచ్చరిక! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
నతాంజ్ అణు కేంద్రంపై బాంబుల వర్షం.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications