Pakistan Train Hijack: పాకిస్తాన్ లో రైలు హైజాక్-బందీలుగా 100 మంది..!

పాకిస్తాన్ లో ఇవాళ ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకూ విమానాల హైజాక్ చూస్తుంటాం. కానీ ఇవాళ పాకిస్తాన్ లో ఓ ఎక్స్ ప్రెస్ రైలును తీవ్రవాదులు అపహరించుకుపోయారు. స్వతంత్ర బలోచిస్తాన్ కోసం పోరాడుతున్న బలోచ్ విముక్తి సైన్యం ఇవాళ జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసింది. ఈ సందర్భంగా ఎదురు తిరిగిన ఆరుగురు ప్రయాణికుల్ని కాల్చిచంపినట్లు తెలుస్తోంది. అలాగే మరో 100 మంది ప్రయాణికుల్ని బందీలుగా చేసుకుంది.

జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసింది తామేనని బలూచ్ లిబరల్ ఆర్మీ బాధ్యత ప్రకటించుకుంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో .. పాకిస్తాన్ రైల్వేలు నడుపుతున్న రైలును హైజాక్ చేసినట్లు తెలిపింది. ఇందులో దాదాపు 100 మంది ప్రయాణికులను బందీలుగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థ రైలును తన ఆధీనంలోకి తీసుకుని కనీసం ఆరుగురు సైనిక సిబ్బందిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌ను BLA మజీద్ బ్రిగేడ్ ఫతే స్క్వాడ్, STOS నిర్వహిస్తున్నాయని ఆ బృందం ప్రతినిధి వెల్లడించారు. ఏదైనా సైనిక చర్యకు ప్రయత్నిస్తే బందీలందరినీ చంపేస్తామని బీఎల్ఏ హెచ్చరించింది.

jaffar express trian hijacked in Pakistan by Baloch liberation army 100 passengers held hostage

ఆక్రమిత దళాలు ఏదైనా సైనిక చర్యకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బలోచ్ ఆర్మీ సంస్ద హెచ్చరించింది. వందలాది మంది బందీలను ఉరితీస్తామని, ఈ రక్తపాతానికి బాధ్యత పూర్తిగా ఆక్రమిత దళాలదే అని ఉగ్రవాద సంస్థ తెలిపింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఇరుకునపడింది. బందీల్ని సురక్షితంగా విడిపించేందుకు ప్రధాని సహా మంత్రులు అధికారులతో చర్చిస్తున్నారు. కొంతకాలంగా సాగుతున్న బలోచిస్తాన్ విముక్తి ఆందోళనలకు పరాకాష్టగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+