పౌరసత్వ సవరణ బిల్లు ఎఫెక్ట్, భారత పర్యటనపై జపాన్ ప్రధాని అనాసక్తి, టూర్ రద్దు..?
పౌరసత్వ సవరణ సెగలతో అసోం అట్టుడుకుతోంది. సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోమని ఆందోళన కారులు ఆందోళన బటపట్టారు. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు చనిపోయిన సంగతి తెలిసిందే. అసోం రాజధాని గువహటి నిరసనలతో హోరెత్తుతుంది. దీంతో తన పర్యటనపై జపాన్ ప్రధాని షింజో అబే తర్జన భర్జన పడుతున్నట్టు తెలిసింది.
గువహటిలో ఆందోళనల నేపథ్యంలో శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు షింజో అబే విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు జపాన్ మీడియా జీజీ పేర్కొన్నది. కానీ దీనిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. గువహటిలో ఈ నెల 15-17 వరకు శిఖరాగ్ర సదస్సు నిర్వహించాలని భారతప ప్రభుత్వం భావించింది. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది.

పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్ ముందుకురావడం, ఆమోదం పొందడంతో నిరసనలు మిన్నంటాయి. దీంతో తన పర్యటనను రద్దుచేయాలని షింజో అబే భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ దీనిని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ధ్రువీకరించలేదు. పర్యటన రద్దుకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు.
అంతకుముందు ఆదివారం నుంచి జపాన్ ప్రధానమంత్రి పర్యటన ప్రారంభమవుతుందని రవీశ్ కుమార్ తెలిపారు. కానీ పౌరసత్వ సవరణ బిల్లుతో పరిస్థితి మారిపోయింది. దీంతో భారత్ వచ్చేందుకు షింజో అబే నిరాకరించినట్టు తెలుస్తోంది. ఆయన పర్యటన రద్దుకు సంబంధించి ఆ దేశం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications