కూతురు చస్తానని బెదిరించడంతో అబార్షన్ చేయించుకున్న తల్లి
న్యూఢిల్లీ: కొత్తగా బేబికి జన్మనిస్తే తనన్ని పట్టించుకోరనే ఈర్ష్యతో ఓ టీనేజీ అమ్మాయి తన తల్లిని బెదిరించి అబార్షన్ చేయించిన ఘటన చైనాలో జరిగింది. వివరాల్లోకి వెళితే... జియో, వాంగ్ అనే దంపతులకు 13 ఏళ్ల కూతురు ఉంది.
2013లో చైనా ఒక జంటకు ఒక్కరే సంతానం అన్న నిబంధనను సడలించడంతో... జియో, వాంగ్ మరో బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 44 ఏళ్ల వయసున్న జియో గర్భం దాల్చిన 13 వారాల తర్వాత వీరి కుమార్తె తీవ్రంగా వ్యతిరేకించింది.
మరో బిడ్డకు జన్మినిస్తే తాను బిల్డింగ్పై నుంచి దూకుతానంటూ హెచ్చరించింది. కుమార్తె హెచ్చరికతో జియో అబార్షన్ చేయించుకుంది. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ 'మా ఇంట్లో మా అమ్మాయే యువరాణి. మా ప్రేమ తనకు మాత్రమే దక్కాలన్నది ఆమె స్వార్థం. నేను బేబికి జన్మనిస్తే బిల్డింగ్పై నుంచి దూకుతానని హెచ్చరించింది.' అని జియో షాంఘై డైలీకి తెలిపింది. అబార్షన్ చేయించుకోవడం బాధకలిగించినా.. కూతురు హెచ్చరికతో తప్పలేదని జియో పేర్కొంది.