పసికందును కిడ్నాప్ చేసింది: సీసీ కెమెరాలు పట్టేశాయి(వీడియో)
హువనన్: ఓ పసికందును ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ కిడ్నాప్ చేసింది. ఆ దృశ్యాలు ఆ ఆస్పత్రి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అంతేగాక, ఆమె ఆస్పత్రి నుంచి ఏయే ప్రాంతాలకు వెళ్లిందో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండటంతో ఆ దృశ్యాలన్నీ నమోదయ్యాయి. దీంతో కిడ్నాప్ కేసు అత్యంత వేగంగా ఛేదించారు అక్కడి పోలీసులు.
చైనాలోని హువనన్ కౌంటీలోని హిలాంగ్జియాంగ్ ప్రావిన్స్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇంటర్నెట్లో వీడియోగా హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలోకి వెళ్లిన ఓ మహిళ.. మెటర్నిటీ వార్డులోని రెండు రోజుల పసికందును ఎత్తుకెళ్లిపోయింది.

బాలుడ్ని తీసుకుని బయటకు అక్కడే ఉన్న వాహనంలో వెళ్లిపోయింది. ఆ తర్వాత ఓ హోటల్ గదికి వెళ్లింది. అక్కడి నుంచి మరో వాహనంలో మరో చోటుకి వెళ్లింది. కాగా, ఆమె వెళ్లిన ప్రతీ చోటా సీసీ కెమెరాలుండటంతో ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనేది స్పష్టం తెలియవచ్చింది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా ఆమెను తక్కువ సమయంలోనే పట్టుకున్నారు. కౌంటీ మొత్తాన్ని జల్లెడ పట్టిన మొత్తం 300మంది పోలీసులు.. గంటల్లోనే ఆ శిశువును ఆమె చెర నుంచి విడిపించారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శిశువును సురక్షితంగా ఆస్పత్రిలో అప్పగించారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications