US ransomware attack: అతిపెద్ద దాడి: మిలియన్ల కొద్దీ డాలర్లు డిమాండ్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అతిపెద్ద సైబర్/రాన్సమ్వేర్ అటాక్ చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీల దిమ్మతిరిగి పోయే రేంజ్లో సంభవించిన దాడి అది. ఐటీ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ కెసయా వీఎస్ఏపై దాడి చేశారు హ్యాకర్లు. 70 మిలియన్ డాలర్లను వారు డిమాండ్ చేశారు. భారతీయ కరెన్సీతో పోల్చుకుంటేే దీని విలువ 520 కోట్ల రూపాయలు. డార్క్ వెబ్సైట్ హ్యాపీ బ్లాగ్ ద్వారా ఈ దాడికి పాల్పడినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనుమానిస్తోంది.
ఈ దాడి వల్ల చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు ప్రభావితమైనట్లు గుర్తించింది. హ్యాకర్లను రెవిల్ గ్యాంగ్గా నిర్ధారించింది. మేనేజ్డ్ ఐటీ సర్వీస్ ప్రొవైడర్లపై సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు ఈ గ్యాంగ్ ముందే వెల్లడించింది కూడా. మిలియన్కు పైగా సిస్టమ్స్ ప్రభావితమైనట్లు తెలిపింది. ఈ దాడి నుంచి తాము వెనక్కి తగ్గాలంటే.. 70 వేల మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుందంటూ రెవిల్ గ్యాంగ్ సూచించింది. ఈ డీల్ కుదిరిన గంట వ్యవధిలోనే సిస్టమ్స్ అన్నింటినీ రీస్టోర్ చేస్తామని తేల్చి చెప్పింది.
రాన్సమ్వేర్ అటాకర్లతో ఐటీ సాఫ్ట్వేర్ ప్రొవైడర్లు గనక ఈ డీల్ను కుదుర్చుకుంటే.. అదో చరిత్ర అవుతుంది. ఓ సైబర్/రాన్సమ్వేర్ దాడిలో ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించడమనేది ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఇదివరకు మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ల మీద చోటు చేసుకున్న దాడిలో గరిష్ఠంగా 37 కోట్ల రూపాయల మేర డీల్ కుదిరింది. ఈ తరహా సైబర్ అటాక్లో కుదిరిన ఒప్పందాలు అత్యల్పంగా 33.5 లక్షల రూపాయలు.

తమ ఆధీనంలో ఉన్న 70 మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్లపై ఈ అటాక్ ఎఫెక్ట్ పడినట్లు సీకో ఉపాధ్యక్షుడు రాస్ మెక్కెర్చర్ తెలిపారు. వాటివల్ల 350 కంపెల లావాదేవీలపై ప్రభావితమైనట్లు చెప్పారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, యూకే సహా అనే దేశాలు, రీజియన్ల నుంచి తాజాగా ఈ కెసయా రాన్సమ్వేర్ అటాక్ చోటు చేసుకున్నట్లు ఎఫ్బీఐ అధికారులు చెబుతున్నారు. ఈ దాడి మూలాలు ఎక్కడున్నాయనే అంశంపై దర్యాప్తు ప్రారంభించారు.
రష్యాకు చెందిన రాన్సమ్వేర్ గ్యాంగ్స్ పని పట్టే ప్రయత్నాల్లో అమెరికా. దీనికోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తోనూ సంప్రదింపులను నిర్వహించింది. ఈ గ్యాంగ్స్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు సాగిస్తోన్న నేపథ్యంలో- తాజా దాడి సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెవిల్ గ్యాంగ్ ఇదివరకు కూడా కొన్ని మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్లను ఇబ్బందులకు గురి చేసినప్పటికీ.. ఈ సారి ఉన్న తీవ్రత అంచనాలకు మించి ఉంటోందని నిపుణులు చెబుతున్నారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications