ఇంగ్లాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది భారత టెక్కీల మృతి
దక్షిణ ఇంగ్లాండ్లో గత శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది భారతీయులు మరణించారు. మొత్తం మృతుల్లో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
లండన్: దక్షిణ ఇంగ్లాండ్లో గత శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది భారతీయులు మరణించారు. మొత్తం మృతుల్లో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరిలో ఐదేళ్ల చిన్నారి ఉంది.
మృతుల్లో ముగ్గురు 'విప్రో'లో, మరో ముగ్గురు నాటింగ్హ్యాంకు చెందిన 'క్యాపిటల్ వన్'సంస్థలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 11మంది ఓ మినీవ్యానులో నాటింగ్హ్యాం నుంచి లండన్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదంలో చనిపోయిన కార్తికేయన్ రామసుబ్రమణియం పుగలూర్, రిషీరాజీవ్కుమార్, వివేక్ భాస్కరన్లు ముగ్గురూ విప్రో ఉద్యోగులేనని సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. తీవ్రంగా గాయపడినవారిలో మరో విప్రో ఉద్యోగి మనోరంజన్ పన్నీర్సెల్వం ఉన్నారు.
రెండు ట్రక్కుల మధ్య మినీవ్యాను ఇరుక్కుని నుజ్జునుజ్జయిందని, ట్రక్కుడ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఫ్రాన్స్కు వెళ్లే వాహనాన్ని చేరుకునేందుకు వీరంతా మినీవ్యానులో బైలుదేరినట్లు వెల్లడించారు. మరణించిన మినీబస్సు డ్రైవరూ భారతీయుడేనని పోలీసులు తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications