ఎంహెచ్370: బంగాళాఖాతంలో శకలం గుర్తించిన జియో
పెర్త్: గల్లంతైన మలేషియా విమానం ఎంహెచ్ 370 ఆచూకీ లభ్యమైనట్లుగా తెలుస్తోంది. విమానం గల్లంతైన చాలా రోజుల తర్వాత ఆచూకీ తెలిసింది. ఆస్ట్రేలియా మెరైన్ ఎక్స్ప్లోరేషన్ (సముద్ర అన్వేషణ సంస్థ) కంపెనీ ఎంహెచ్ 370 ఆచూకీని గుర్తించింది. గల్లంతైన విమానం శకలాలను బంగాళాఖాతంలో గుర్తించినట్లుగా సదరు సంస్థ తెలిపింది.
ప్రస్తుతం ఎంహెచ్ 370 విమానం కోసం అన్వేషిస్తున్న హిందూ మహాసముద్రానికి ఐదువేల కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో శకలాలను గుర్తించింది.
అడిలైడ్ బెస్డ్ జియో రీజోనెన్స్ సంస్థ దీనిపై స్పందిస్తూ... గల్లంతైన ఎంహెచ్ 370 విమానం కోసం తాము వెతుకుతున్నట్లుగా చెప్పింది.
ఈ అన్వేషణలో... తాము ప్రస్తుతం అన్వేషిస్తున్న ప్రాంతానికి ఐదువేల కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో శకలాలను గుర్తించినట్లుగా ప్రకటించినట్లుగా స్టార్ న్యూస్ పేపర్ తెలిపింది. జియో రీజోనెన్స్ 2,000,000 స్వేర్ కిలోమీటర్ల పరిధిలో గాలింపు చర్యలు చేపట్టింది. ఈ సంస్థ 20 రకాల సాంకేతిక పద్ధతుల ద్వారా అన్వేషణ చేపట్టింది.