రోమ్ కాఫీ షాప్ సమీపంలో కాల్పులు: ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
రోమ్: ఇటలీలోని రోమ్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉత్తర రోమ్లోని ఓ కాఫీ షాప్ దగ్గర ఆదివారం ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు.
ఈ ఘటనపై రోమ్ మేయర్ రాబర్టో గ్వాల్టీరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ నగరంలో జరిగిన తీవ్ర హింసాత్మకమైన ఘటన ఇదని అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఫిడేన్ శ్రామిక వర్గ పరిసరాల్లో జరిగిన దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు ఆయన ధృవీకరించారు. కండోమినియం మీటింగ్ లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బాధిత కుటుంబాలను సోమవారం కలుస్తానని చెప్పారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. నిందితుడు మొదట మీ అందర్నీ కాల్చి చంపేస్తాంంటూ అరుస్తూ బార్ లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత వెంటనే కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ముగ్గురు చనిపోగా, చాలా మంది గాయపడ్డారు.
ఈ క్రమంలో కొంత మంది నిందితుడ్ని పట్టుకుని.. పోలీసులు వచ్చిన తర్వాత వారికి అప్పగించారు. గతంలో కూడా నిందితుడు బోర్డు సభ్యులను బెదిరింపులకు గురిచేశాడని బాధితులు కొందరు తెలిపారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications