సిరియాపై అమెరికా క్షిపణి దాడి?: తమకు సంబంధం లేదన్న పెంటగాన్..
డమార్కస్: సిరియాలో అమాయకులు బలైపోతూనే ఉన్నారు. తాజాగా సిరియా మిలిటరీ ఎయిర్ పోర్టుపై జరిగిన క్షిపణి దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికానే
ఈ
దాడులకు
పాల్పడినట్టు
మొదట
అనుమానం
వ్యక్తం
చేసిన
సిరియా
స్టేట్
మిడియా..
ఆ
తర్వాత
దాన్నే
ధ్రువీకరించింది.
అమెరికానే
దాడులకు
పాల్పడిందని
తెలిపింది.
'దౌమా'పై
రసాయనిక
దాడులకు
'ఎనిమల్
అసద్'
మూల్యం
చెల్లించాల్సిందేనని
ట్రంప్
ట్వీట్
చేసిన
గంటల్లోనే
సిరియాపై
దాడి
జరగడం
ఈ
అనుమానాలకు
ఊతమిచ్చింది.
మరోవైపు పెంటగాన్(అమెరికా రక్షణశాఖ) మాత్రం క్షిపణి దాడులను ఖండించింది. తాము దాడులకు పాల్పడలేదని పేర్కొంది. మరణాల సంఖ్యను నిర్దారించకపోయినప్పటికీ.. భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగిందని సిరియన్ మీడియా తెలిపింది.
సిరియా 'ఆకలి'కి సజీవ సాక్ష్యం: ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్న ఫోటో.
సిరియాలో పరిస్థితులకు ఆ దేశ అధ్యక్షుడు అసద్ తో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ కూడా బాధ్యత వహించాలని ట్రంప్ డిమాండ్ చేశారు.