మార్స్పై ఆపర్చ్యునిటీ మారథాన్ పూర్తి, 11 ఏళ్ల 2 నెలలు
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన ఆపర్చ్యూనిటీ రోవర్.. అంగారక గ్రహం పైన మారథాన్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందుకు పదకొండేళ్లకు పైగా సమయం తీసుకుంది. మొత్తం 42.195 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణించింది.
ఇందుకు పదకొండు ఏళ్ల రెండు నెలల సమయం తీసుకుంది. మార్స్ గ్రహం పైన నీటి ఆనవాళ్లను గుర్తించేందుకు ఈ రోవర్ దిగింది. అక్కడి శీతాకాలాన్ని తట్టుకొని ఇది నిలబడుతుందా అనే సందేహాలు వ్యక్తమైనప్పటికీ... రోవర్ ఇన్నేళ్ల పాటు మనుగడ సాగించింది.

మార్స్ రోవర్ ఆపర్చునిటీ తాను దిగిన ఈగిల్ బిలంలో నీటికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించింది. తదుపరి పంపే రోవర్ను ఎండీవర్ బిలంలోకి దించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది మార్చి 24వ తేదన తన మారథాన్ పూర్తి చేసింది.












Click it and Unblock the Notifications