శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు: ఓటేసిన మహేంద్ర రాజపక్సే (ఫోటోలు)
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. ఉదయం నుంచే ఓటు వేసేందుకు జనం పోలింగ్ బూత్ల దగ్గర బారులు తీరారు. ఈ ఎన్నికల్లో మూడోసారి ప్రస్తుత అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
శ్రీలంకలో దాదాపు 16 లక్షల మంది ఓటర్లున్నారు. మొత్తం 19 మంది అభ్యర్థులు అధ్యక్ష ఎన్నికకు బరిలో ఉన్నారు. అవినీతి, అస్తవ్యస్థ పాలన, తిరుగుబాట్లు ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రతికూలంగా మారాయి. మహేంద్ర రాజపక్సే కేబినేట్లోని కీలక మంత్రి మైత్రిపాల సిరిసేన ఈ మధ్యే పార్టీని వీడి విపక్షాలతో చేతులు కలిపారు. ప్రధాన పోటీ ప్రస్తుత అధ్యక్షుడు రాజపక్సే, మైత్రిపాల సిరిసేన మధ్యనే ఉంది.
దేశంలో మెజార్టీ వర్గమైన సింహాళ వర్గానికి చెందిన ఆయన మైనార్టీలు అయిన తమిళులు, ముస్లిం లీగ్ నాయకులను కలుపుకొని రాజపక్సేకు గట్టి పోటీనిస్తున్నారు. దీంతో మూడోసారి అధ్యక్ష పదవిని దక్కించుకోవటం మహేంద్ర రాజపక్సెకు అంత ఈజీ కాదని తెలుస్తోంది.
మహేంద్ర రాజపక్సే తన నియోజకవర్గమైన హంబన్ టోటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, విజయంపై ధీమా వ్యక్తం చేశారు. "ఎన్నికల్లో విజయం సాధిస్తాం. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. రేపటి నుంచి మా మేనిఫెస్టోను అమలుచేస్తాం" అని రాజపక్సే తెలిపారు.
ఎన్నికల వేడి నేపథ్యంలో, హింసాత్మక ఘటనలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని రాజపక్సేకు అమెరికా విదేశాంగమంత్రి మంత్రి జాన్ కెర్రీ సూచించారు.

శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసేందుకు వస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే.

శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు
మహేంద్ర రాజపక్సే తన నియోజకవర్గమైన హంబన్ టోటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, విజయంపై ధీమా వ్యక్తం చేశారు. "ఎన్నికల్లో విజయం సాధిస్తాం. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. రేపటి నుంచి మా మేనిఫెస్టోను అమలుచేస్తాం" అని రాజపక్సే తెలిపారు.

శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు
శ్రీలంకలో దాదాపు 16 లక్షల మంది ఓటర్లున్నారు. మొత్తం 19 మంది అభ్యర్థులు అధ్యక్ష ఎన్నికకు బరిలో ఉన్నారు. అవినీతి, అస్తవ్యస్థ పాలన, తిరుగుబాట్లు ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రతికూలంగా మారాయి. మహేంద్ర రాజపక్సే కేబినేట్లోని కీలక మంత్రి మైత్రిపాల సిరిసేన ఈ మధ్యే పార్టీని వీడి విపక్షాలతో చేతులు కలిపారు.

శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు
మైత్రిపాల సిరిసేన తన నియోజకవర్గమైన పొలంనురవాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాన పోటీ ప్రస్తుత అధ్యక్షుడు రాజపక్సే, మైత్రిపాల సిరిసేన మధ్యనే ఉంది.

శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు
దేశంలో మెజార్టీ వర్గమైన సింహాళ వర్గానికి చెందిన ఆయన మైనార్టీలు అయిన తమిళులు, ముస్లిం లీగ్ నాయకులను కలుపుకొని రాజపక్సేకు గట్టి పోటీనిస్తున్నారు. దీంతో మూడోసారి అధ్యక్ష పదవిని దక్కించుకోవటం మహేంద్ర రాజపక్సెకు అంత ఈజీ కాదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications