కుప్పకూలిన మిలిటరీ విమానం: బౌద్ధ గురువుతోపాటు 12 మంది మృతి
నైపీడా: మయన్మార్ దేశంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ప్రముఖ బౌద్ధ గురువుతోపాటు 12 మంది మరణించారు. ఈ ప్రమాద ఘటన మయన్మార్లోని మండాలయ ప్రాంతంలో చోటు చేసుకుంది. నైపీడా నుంచి పైన్ ఓ ఎల్విన్ నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Recommended Video
గురువారం దేశ రాజదాని నైపీడా నుంచి ఓ ఎల్విన్ పట్టణానికి ఓ మఠం శంకుస్థాపన చేసేందుకు బౌద్ధ గురువుతోపాటు 14 మంది మిలిటరీ విమానంలో బయల్దేరారు. విమానంలో ఆరుగురు మిలిటరీ సిబ్బందితోపాటు ఇద్దరు బౌద్ధమత గురువులు, ఆరుగురు భక్తులు ఉన్నారు.

400 మీటర్ల ఎత్తుకు ఎగిరిన తర్వాత వాతావరణం సహకరించకపోవడంతో సిగ్నల్స్ అందలేదు. దీంతో విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో సీనియర్ బౌద్ధ గురువుతోపాటు 12 మంది దుర్మరణం పాలయ్యారు. ఓ సైనికుడితోపాటు మరొకరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. ప్రమాద ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మయన్మార్లో సైనిక పాలన నడుస్తున్న విషయం తెలిసిందే.
కాగా, 2016 ఫిబ్రవరిలో నైపీడా నుంచి గాలిలోకి ఎగిరిన కాసేపటికే ఎయిర్ ఫోర్స్ బీచ్ క్రాఫ్ట్ 1900డీ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications