కుప్పకూలిన మిలిటరీ విమానం: బౌద్ధ గురువుతోపాటు 12 మంది మృతి
నైపీడా: మయన్మార్ దేశంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ప్రముఖ బౌద్ధ గురువుతోపాటు 12 మంది మరణించారు. ఈ ప్రమాద ఘటన మయన్మార్లోని మండాలయ ప్రాంతంలో చోటు చేసుకుంది. నైపీడా నుంచి పైన్ ఓ ఎల్విన్ నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Recommended Video
గురువారం దేశ రాజదాని నైపీడా నుంచి ఓ ఎల్విన్ పట్టణానికి ఓ మఠం శంకుస్థాపన చేసేందుకు బౌద్ధ గురువుతోపాటు 14 మంది మిలిటరీ విమానంలో బయల్దేరారు. విమానంలో ఆరుగురు మిలిటరీ సిబ్బందితోపాటు ఇద్దరు బౌద్ధమత గురువులు, ఆరుగురు భక్తులు ఉన్నారు.

400 మీటర్ల ఎత్తుకు ఎగిరిన తర్వాత వాతావరణం సహకరించకపోవడంతో సిగ్నల్స్ అందలేదు. దీంతో విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో సీనియర్ బౌద్ధ గురువుతోపాటు 12 మంది దుర్మరణం పాలయ్యారు. ఓ సైనికుడితోపాటు మరొకరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. ప్రమాద ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మయన్మార్లో సైనిక పాలన నడుస్తున్న విషయం తెలిసిందే.
కాగా, 2016 ఫిబ్రవరిలో నైపీడా నుంచి గాలిలోకి ఎగిరిన కాసేపటికే ఎయిర్ ఫోర్స్ బీచ్ క్రాఫ్ట్ 1900డీ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications