ఉత్తర కొరియా దుస్సాహసం: మళ్లీ అణు పరిక్షలు
ఉత్తర కొరియా దుస్సాహసం చేస్తున్నది. ప్రపంచ దేశాలను కాదని మరో రెచ్చగొట్టే కార్యక్రమం పూర్తి చేసింది. బహుళ అణు రాకెట్లను ప్రయోగించగల వ్యవస్థను తయారు చేసుకుంది. దీనిని పరీక్షించడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు.
ఈ విషయాన్ని ఆదేశ అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ ప్రకటించింది. కొత్తగా లార్జ్ మల్టీ రాకెట్ లాంచర్ ను తయారు చేసిన శాస్ర్తవేత్తలు, అధికారులను ఉన్ పోగడ్తలతో ముంచెత్తారని ప్రకటించింది. దీనిని వెంటనే పరిక్షించి చూడాలని కూడ ఉన్ శాస్ర్తవేత్తలకు సూచించారని వెల్లడించింది.
కొరియా సైన్యం, ప్రజలు వ్యూహాత్మక బలాన్నికలిగి శత్రువులను ఎప్పుడంటే అప్పుడు డీకొనే స్థాయిలో ఉండేందుకు రూపొందించిన ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఆర్మీ అధికారులు తెలిపారని కేసీఎన్ఏ వెల్లడించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియాతో పాటు అమెరికా సీరియస్ గా తీసుకున్నాయి.