కెమిస్ట్రీలో ముగ్గురు సైంటిస్ట్లకు నోబెల్ బహుమతి
కెమిస్ట్రీలో 2017కు గాను ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ అవార్డు వరించింది. స్విట్జర్లాండ్కు చెందిన జాక్స్ దుబోచెట్, జోచిమ్ ఫ్రాంక్(యూఎస్ఏ), రిచర్డ్ హెండర్సన్(యూకే)లకు ఈ పురస్కారాన్ని ప్రకటిం
స్టాక్ హోమ్: కెమిస్ట్రీలో 2017కు గాను ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ అవార్డు వరించింది. స్విట్జర్లాండ్కు చెందిన జాక్స్ దుబోచెట్, జోచిమ్ ఫ్రాంక్(యూఎస్ఏ), రిచర్డ్ హెండర్సన్(యూకే)లకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
ద్రావకంలో జీవకణాలను గుర్తించి క్రియో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని అభివృద్ధి చేసినందుకు వీరికి నోబెల్ ప్రకటించారు. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ప్రకటన చేసింది.

ఇప్పటివరకు రసాయనశాస్త్రంలో 109 సార్లు నోబెల్ పురస్కారాలు ఇచ్చారు. ఇందులో ఒకరు రెండుసార్లు అందుకున్నారు. బ్రిటన్కు చెందిన బయోకెమిస్ట్ ఫ్రెడెరిక్ శాంగర్ 1950, 1980లో నోబెల్ బహుమతి అందుకున్నారు.












Click it and Unblock the Notifications