భూ తాపాన్ని నియంత్రించేలా: ఫిజిక్స్లో అద్భుత ఆవిష్కరణ: ముగ్గురికి నోబెల్
స్టాక్హోమ్: వేర్వేరు రంగాలకు చెందిన శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు ప్రతి సంవత్సరం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల ప్రకటనలు రెండో రోజుకు చేరుకున్నాయి. స్పర్శకు సంబంధించిన నూతన ఆవిష్కరణలను కనుగొన్న అమెరికాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలకు మెడిసిన్లో నోబెల్ బహుమతిని ప్రకటించింది కమిటీ. రెండో రోజు భౌతిక శాస్త్రం వంతు. ఫిజిక్స్ గతిని మార్చే విధంగా కొత్త ఆవిష్కరణలను కనుగొన్న ముగ్గురు సైంటిస్టుల పేర్లను కమిటీ ఎంపిక చేసింది.
BREAKING NEWS:
— The Nobel Prize (@NobelPrize) October 5, 2021
The Royal Swedish Academy of Sciences has decided to award the 2021 #NobelPrize in Physics to Syukuro Manabe, Klaus Hasselmann and Giorgio Parisi “for groundbreaking contributions to our understanding of complex physical systems.” pic.twitter.com/At6ZeLmwa5
ఈ సంవత్సరం భౌతిక శాస్త్రానికి కు సంబంధించిన నోబెల్ అవార్డుల కోసం స్యుకురో మనబే, క్లాజ్ హ్యాసిల్మ్యాన్, జార్జియో పరిసిలను ఎంపిక చేసింది. ఈ ముగ్గురూ వేర్వేరు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు. స్యుకురో మనబే స్వదేశం జపాన్. క్లాజ్ హ్యాసిల్మ్యాన్ది జర్మనీ. కాగా జార్జ్ పరిసి ఇటలీకి చెందిన సైంటిస్ట్. ఈ ముగ్గురు ఫిజిక్స్లో నూతన ఆవిష్కరణలను కనుగొన్నారు. స్యుకురో మనబే.. హ్యాసిల్మ్యాన్- భూ వాతావరణం, భూ తాపానికి సంబంధించిన విషయాలను ముందుగానే అంచనా వేసేలా కొత్త ఆవిష్కరణలను గుర్తించారు.

భూ వాతావరణం మానవాళిని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశాలపై ఆరా తీయడానికి అవసరమైన పునాదులను వేశారని నోబెల్ ప్యానెల్ కమిటీ ప్రశంసించింది. కార్బన్ డయాక్సైడ్ భూతాపం పెరగడానికి ఎలా కారణమౌతోందనే విషయంపై స్యుకురో మనబే 1960 నుంచి పరిశోధనలు సాగిస్తున్నారని కమిటీ పేర్కొంది. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్ పరిమాణాన్ని తగ్గించుకోవడానికి అవకాశం లభించిందని అభిప్రాయపడింది.
Syukuro Manabe and Klaus Hasselmann have been jointly awarded one half of the 2021 #NobelPrize in Physics “for the physical modelling of Earth’s climate, quantifying variability and reliably predicting global warming.”
— The Nobel Prize (@NobelPrize) October 5, 2021
భూ వాతావరణం, భూతాపం, కార్బన్ డయాక్సైడ్ ప్రభావం మానవాళిని ఎలా ప్రభావితం చేస్తోందనే అంశాన్ని హ్యాసిల్మ్యాన్ తన ప్రయోగాల ద్వారా శాస్త్రీయబద్ధంగా నిరూపించారని తెలిపింది. బయాలజీ, న్యూరోసైన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ సిస్టమ్స్ను మరింత లోతుగా పరిశోధనలను సాగించడానికి వీలుగా ఫిజికల్ అండ్ మ్యాథమేటికల్ మోడల్స్ను జార్జియో పరిసి అభివృద్ధి చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రెటరీ జనరల్ గోరాన్ హాన్సెన్ తెలిపారు.
Giorgio Parisi has been awarded one half of the 2021 #NobelPrize in Physics “for the discovery of the interplay of disorder and fluctuations in physical systems from atomic to planetary scales.”
— The Nobel Prize (@NobelPrize) October 5, 2021
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications