అమెరికాను టార్గెట్ చేయగలదు: ఉ కొరియా మరో ప్రయోగం
పెద్దన్న అమెరికా హెచ్చరికలు పట్టించుకోకుండా వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తర కొరియా మరో క్షిపణి పరీక్ష జరిపింది. మధ్యతరహా క్షిపణిని పరీక్షించింది.
వాషింగ్టన్: పెద్దన్న అమెరికా హెచ్చరికలు పట్టించుకోకుండా వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తర కొరియా మరో క్షిపణి పరీక్ష జరిపింది. ఇది మధ్యతరహా క్షిపణి.
పరీక్ష విజయవంతమని..
అదివారం నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైందని ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది. దానిని సైన్యానికి అందించేందుకు సిద్ధం చేశామని వెల్లడించారు.
అమెరికా బేస్ క్యాంపులను టార్గెట్ చేయగలదు
తాజాగా నిర్వహించిన క్షిపణిని భూమి నుంచి, జలంతర్గామి నుంచి ప్రయోగించవచ్చని ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ క్షిపణి అమెరికాలోని ముఖ్య ప్రాంతాలకు, మిలటరీ ప్రాంతాలకు, అలాగే జపాన్ను టార్గెట్ చేయగలుగుతుందని అంటున్నారు.
కచ్చితమైన ఫలితాలు సాధించామని..
ఆ దేశ మధ్యశ్రేణి క్షిపణి పరీక్షలపై అమెరికా, దక్షిణ కొరియా తదితర దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఉత్తర కొరియా తాజా క్షిపణి పరీక్ష విజయవంతమైందని, ఖచ్చితమైన ఫలితాలు సాధించామని ప్రకటించింది.
ఐరాసలో డిమాండ్
ఉత్తర కొరియా దూకుడు నేపథ్యంలో ఈ అంశంపై చర్చిందేందుకు ఐక్య రాజ్య సమితి భద్రత మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని అమెరికా, జపాన్, దక్షిణాకొరియా డిమాండ్ చేశాయి.