ట్రంప్కు షాక్: దక్షిణ కొరియాతో చర్చలకు సిద్దం, ఒలంపిక్కు ప్రతినిధులు: కిమ్
ప్యాంగ్యాంగ్: అమెరికాతో పాటు దాని మిత్రదేశాలకు చుక్కలు చూపిస్తున్న ఉత్తరకొరియా నుండి తొలిసారిగా దక్షిణ కొరియాతా చర్చలకు సిద్దమని ప్రకటించింది కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ దక్షిణ కొరియాతో తాము చర్చలకు సిద్దమని స్పష్టం చేశారు. కిమ్ ప్రకటనతో రెండు దేశాల మధ్య మంచి సంప్రదాయాలు నెలకొనే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
Recommended Video

ఉత్తరకొరియా ఇటీవల కాలంలో అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచదేశాలకు సవాల్ విసురుతోంది. నూతన సంవత్పరాన్ని పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలకు ఉత్తరకొరియా అధ్యక్షుడు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
అణు శక్తి సామర్థ్యాలను పెంచుకొంటామని కిమ్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా తమను బ్లాక్ మెయిల్ చేసినంత కాలం అణుశక్తి సామర్థ్యాలను పెంచుకొంటూనే ఉంటామని కిమ్ ఇదివరకే ప్రకటించారు.

దక్షిణ కొరియాతో చర్చలకు సిద్దం
అమెరికా దాని మిత్రదేశాలకు ఉత్తరకొరియా అధ్య క్షుడు కిమ్ జంగ్ ఉన్ తన సత్తాను చూపుతున్నాడు. అయితే అమెరికాకు మిత్ర దేశంగా ఉన్న దక్షిణ కొరియాకు కిమ్ జంగ్ స్నేహ హస్తాన్ని చాటారు. దక్షిణ కొరియా అమెరికాతో సన్నిహితంగా ఉంటుంది. ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియా అమెరికాతో చేతులు కలిపింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు బహిరంగ చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఉ.కొరియా.. ద.కొరియాను ఆహ్వానించింది..

దక్షిణ కొరియాలో ఒలంపిక్స్కు ఉత్తరకొరియా ప్రతినిధులు
ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు బహిరంగ చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఉ.కొరియా.. ద.కొరియాను ఆహ్వానించింది. ఉత్తర-దక్షిణ కొరియాల మధ్య శాంతిపూర్వక వాతావరణం ఏర్పడేలా చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అందుకు ఇరు దేశాల మధ్య సహకారం ఉండాలన్నారు. ఫిబ్రవరిలో దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్కు ఉత్తరకొరియా నుంచి ప్రత్యేకంగా డెలిగేట్లను పంపిస్తామని కిమ్ తెలిపారు.

స్వాగతించిన దక్షిణ కొరియా
ఉత్తరకొరియా ఆహ్వనాన్ని దక్షిణ కొరియా స్వాగతించింది. శాంతి పూర్వక చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ద.కొరియా ప్రకటించింది. ఏ సమయంలోనైనా తాము ఆ దేశంతో చర్చించేందుకు సుముఖంగా ఉన్నామని ద.కొరియా ప్రకటించింది. రెండు దేశాలు కూడ తమ మధ్య శాంతి నెలకొనాలని కోరుకోవడం మంచి పరిణామమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇరు దేశాల అధికారుల చర్చలు
రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు ఇరు దేశాల అధికారులు త్వరలోనే సమావేశమయ్యే అవకాశాలు లేకపోలేదు. వీలైనంత త్వరగా ఇరు దేశాల అధికారులు కలిసి కూర్చొని చర్చలు జరుపుతామని కొరియన్ పెనిన్సులా ప్రకటించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications